ఆ రెండు టాక్ షో లకు ముఖ్య అతిథిగా విచ్చేయనున్న పవన్ కళ్యాణ్..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తరికెక్కుతున్న హరిహర వీరమల్లు అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  ఎం ఎం కీరవాణి ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లో రెండు టాక్ షో లకు ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు తెలుస్తోంది ... నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.  ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 2 విజయవంతంగా నడుస్తోంది. ఈ టాక్ షో కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి గా మరి కొన్ని రోజుల్లో రాబోతున్నట్లు తెలుస్తోంది.  

ఇది ఇలా ఉంటే  ఆలీ ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారం అవుతున్న ఆలీతో సరదాగా అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈటీవీ లో ప్రసారం అవుతున్న ఆలీతో సరదాగా టాక్ షో కు కూడా పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ రెండు టాక్ లకు కూడా పవన్ కళ్యాణ్ అతి తక్కువ వ్యవధి లోనే హాజరు కాబోతున్నట్లు కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం భీమ్లా నాయక్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ తో పాటు రానా హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: