అదంతా నా తల రాత.. ఏం చేయగలమంటున్న సాయి పల్లవి?

praveen
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మలయాళ భామ సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ సినిమాలతోనే  తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇక నటనతో విమర్శకులను మెప్పించి ప్రశంసలు కూడా అందుకుంది. ఇటీవల కాలంలో గ్లామర్ వలకబోస్తే  తప్ప కెరియర్ ఉండదు అనుకుంటున్నా రోజుల్లో పొట్టి పొట్టి డ్రెస్సుల జోలికి పోకుండానే వరుస అవకాశాలు అందుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది సాయి పల్లవి. ప్రేమమ్ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది.

 తెలంగాణ అమ్మాయిగా నటించడమే కాదు తన పాత్రకు తెలంగాణ యాసలో తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకొని ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఇక తన మాటలు తన డాన్సులతో అందరిని కట్టిపడేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో ఈ అమ్మడు ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. యువ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు కూడా అందరు సినిమాలో ఛాన్స్ కొట్టేస్తుంది. ఇక ప్రస్తుతం ఒకవైపు లేడి ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే సాయి పల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను వదులుకున్న సినిమాల గురించి  ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

 చాలామంది హీరోయిన్స్ కొన్ని సినిమాలను వదులుకుంటారు. కానీ అవి హిట్ అవుతాయి. ఇలా హిట్ అయినప్పుడు అలాంటి అవకాశం ఎందుకు మిస్ చేసుకున్నామని బాధపడతారా అంటూ సాయి పల్లవికి ప్రశ్న ఎదురయింది. ఈ క్రమంలోనే ఈ అమ్ముడు సమాధానం చెబుతూ.. మిస్ చేసుకున్న పాత్రల కోసం గుర్తుచేసుకొని ఎప్పుడు నేను బాధపడను. అలాంటి పాత్రలకు మనకు రాసిపెట్టి లేదు అంతే.. అది విధిరాత మాత్రమే అని భావిస్తాను తప్ప.. బాధపడను అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. సాయి పల్లవి నిజమే చెప్పిందంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: