ఇంకో హిట్ కోసం నిఖిల్ సిద్ధార్థ్ ప్రయత్నం..!!

murali krishna
విభిన్న కథలతో ఆడియెన్స్ ను అలరిస్తున్నారు యంగ్ హీరో నిఖిల్ ,యంగ్ అండ్ గ్లామర్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ రీసెంట్ గా వీరిద్దరూ జంటగా నటించిన చిత్రం 'కార్తీకేయ 2 అని మన అందరికి తెలిసినా విశయమె,ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందేఈ ఎపిక్ బ్లాక్ బాస్టర్ కు తెలుగుతో పాటు, హిందీ, తమిళ్,ఇతర భాషల్లోనూ ప్రేక్షకులు బ్రహ్మర్థం పట్టారు. బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత నిఖిల్ - అనుపమా జంటగా నటించిన చిత్రం '18 పేజెస్'. రొమాంటిక్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ కూడా రిలీజ్ కు సిద్ధం అవుతోంది.
దీపావళి సందర్భంగా చిత్రం నుంచి కీలక అప్డేట్ ను అందించారు మూవీ మేకర్స్. ఆడియెన్స్ కు 'దీపావళి' శుభాకాంక్షలు తెలుతూ చిత్ర విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఈ ఏడాది చివర్లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. 2022 డిసెంబర్ 23న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని తెలిపారు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ కథ అందించగా.. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పిస్తుండగా జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే  నుంచి వచ్చిన రొమాంటిక్ గ్లిమ్స్ సినిమా పై బాగా ఆసక్తిని పెంచేసింది అని చెప్పొచ్చు. నిఖిల్, నందిని పాత్రలు కూడా బాగ ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేస్తున్నాయిమరో బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో హిట్ కొట్టనున్నారని అర్థవుతోంది. ప్రస్తుతం చిత్రం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంటంది. దీని తర్వాత యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నం కానుంది మరీ. 'కార్తీకేయ 2'తో భారీ సక్సెస్ ను అందుకున్న ఈ జోడీ '18 పేజెస్'తో తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సినిమాపై బారి అంచనాలు నెలకొన్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: