కాంతారా సినిమా కూడా కాపీనా? తెరపైకి మరో వివాదం..

Satvika
ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సినిమా కాంతారా..ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది..ఇప్పటికే 215 కోట్ల రూపాయల బిజినెస్‌ చేసినట్టు టాక్‌.IMDBలో 10కి గాను 9.3 రేటింగ్ సాధించిన భారతీయ చిత్రంగా కాంతారా రికార్డు నెలకొల్పింది. ఎంత వేగంగా ఈ చిత్రం ప్రేక్షకుల క్రేజ్‌ సంపాదించుకుందో అంతే స్పీడ్‌గా ఈ ను కాంట్రోవర్సీలు చుట్టుముడుతున్నాయి. తమ కళారూపం భూత కోలను ఈ చిత్రంలో తప్పుగా చూపారని తుళు ప్రజలు నిరసన తెలిపారు.  సోషల్‌ మీడియా సైట్స్‌లో ఈ చిత్ర కథ గురించి రాజకీయ చర్చలూ జరుగుతున్నాయి.

కర్నాటకలోని ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలతో పాటు కేరళలోని కొన్ని జిల్లాల్లోని తుళు భాష మాట్లాడే ప్రజలు ఏటా ఆత్మలు లేదా దేవతలు కొలిచే ఒక జానపద సంప్రదాయం భూతకోల. తుళు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం భూత కోల లేదా దైవ కోల అనేది వైదికేతర సంప్రదాయం. ఇందులో పూర్వీకులను భూతాలు లేదా దైవాలుగా ఆరాధించే సంప్రదాయం ఇది. ఈ వేడుకలో భాగంగా భూతాలకు ప్రతిబింబాలుగా నిలిచే విగ్రహాలు తీసుకొని డప్పులు వాయిస్తూ, మతాబులు పేల్చుతూ ఊరేగింపు నిర్వహిస్తారు. ఊహించని శక్తుల నుంచి ఈ ఆత్మలు గ్రామాన్ని రక్షిస్తాయన్నది ఈ ప్రాంత ప్రజల నమ్మకం. ఈ భూత కోల అన్నది హిందూ సంప్రదాయంలో భాగమని ఈ చిత్ర హీరో, దర్శకుడు రిషబ్‌ శెట్టి ప్రకటించడం వివాదంగా మారింది. అయితే వరాహరూపం పాటలో వరాహాన్ని విష్ణుమూర్తి అవతారంగా చూపడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు.

ఈ హిందూ మతం ఆవిర్బావించక ముందు కర్నాటక నేలకు సొంత సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర ఉందని కన్నడ నటుడు చేతన్‌ కుమార్‌ అహింస ద్వారా నిరసనను తెలిపారు. వేల సంవత్సరాలకు ముందు నుంచే ఆదివాసీ సంస్కృతిలో భూత కోల వంటి సంప్రదాయాలున్నాయని ఆయన అంటున్నారు. చేతన్ చేసిన ఆరోపణలపై హీరో రిషబ్‌ శెట్టి స్పందించలేదు. కాని నిర్మాణంలో తాను అనేక జాగ్రత్తలు తీసుకున్నానని స్పష్టం చేసారు. మరో వైపు చేతన్‌ వ్యాఖ్యలు హైందవ మతాన్ని కించపరిచేలా ఉన్నాయని పేర్కొంటూ ఆయనపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. అంతే కాదు ఈ లో హైలైట్‌గా నిలిచిన వరాహ రూపం పాట తమదని దాన్ని కాపీ కొట్టారని కేరళకు చెందిన తైకుడం బ్రిడ్జి అనే మ్యూజిక్‌ బ్యాండ్ ఆరోపించింది. నవరసం పేరుతో తాము ఐదేళ్ల క్రితమే రూపొందించిన పాటను కాపీ కొట్టి వరాహ రూపం పాటను రూపొందించారని ఈ మ్యూజిక్‌ బ్రాండ్‌ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

ఇప్పుడు మరో వివాదం కాంతారాను చుట్టుముట్టింది. 2019లో వచ్చిన తుళు చిత్రం పింగారకు కాపీ అనే మాటలు వినిపిస్తున్నాయి. పింగారా చిత్రానికి ఉత్తమ తుళు గా జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఆత్మల ఆరాధన లేదా దైవారాధన ఇతివృత్తంతో ఈ సాగుతుంది. పింగారా చిత్రంలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకపోవడంతో దానికి పెద్దగా గుర్తింపు రాలేదు. కాని అవార్డులు, క్రిటిక్స్‌ ప్రశంసలు అందుకుంది పింగారా. ఈ కథకే కమర్షియల్‌ హంగులు అద్ది ఇప్పుడు కాంతారా పేరుతో రిషబ్‌ శెట్టి తీశారని విమర్శలు వస్తున్నాయి. వివాదాలు ఏమున్నా దేశంలోని చాలా ప్రాంతాల వారికి తెలియని ఆచారాలు, సంప్రదాయాలను ఆకట్టుకునేలా చూపడంలో హీరో, దర్శకుడు రిషబ్‌ శెట్టి సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి..మొత్తానికి ఈ సినిమా రచ్చ లతోనే బాగా ఫెమస్ అయ్యింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: