టెంపర్ సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరు తెలుసా..?

Divya
జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ లు సాధించిన సినిమాలలో టెంపర్ సినిమా కూడా ఒకటి. వక్కంతం వంశీ కథ అందించగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. వాస్తవానికి వక్కంతం వంశీ ఈ సినిమాను తన డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించి సక్సెస్ పొందాలని అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ కోరడంతో ఈ సినిమాను పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేయడానికి వక్కంతం వంశీ అంగీకరించాడు. వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న ఎన్టీఆర్ కి ఈ సినిమా మంచి సక్సెస్ అందించింది. అంతేకాదు ఎన్టీఆర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా.
అయితే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టెంపర్ సినిమాకు సంబంధించి షాకింగ్ విషయాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ టెంపర్ సినిమాను రవితేజ చేయాల్సి ఉంది . షాడో సినిమా తర్వాత వక్కంతం వంశీ కథతో రవితేజ హీరోగా పవర్ పేరుతో ఈ సినిమాను తెరకెక్కించాలని భావించాను అని ఆయన చెప్పుకోచ్చారు. రవితేజ తో నా డైరెక్షన్ లో తెరకెక్కించాల్సిన రెండు సినిమాలు కూడా ఆగిపోయాయని మెహర్ రమేష్ వెల్లడించారు.

అయితే స్క్రిప్ట్ విషయంలో ఏర్పడిన కొన్ని సమస్యల వల్ల ఈ రెండు ప్రాజెక్టులు కూడా ఆగిపోయాయి అని ఆయన కామెంట్లు చేయడం జరిగింది. రవితేజ బాబీ కాంభో మూవీకి నా టైటిల్ అయిన పవర్ ను ఫిక్స్ చేశారని మెహర్ రమేష్ వెల్లడించారు.  నేను డైరెక్టర్ కావడానికి కారణం చిరంజీవి అని, క్రియేటివిటీ విషయాలలో నాకు పవన్ కళ్యాణ్ స్ఫూర్తి అని మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు. ఇక చిరంజీవి , పవన్ కళ్యాణ్ ద్వారా తనకు జ్ఞానం పెరిగిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే రవితేజ మిస్ చేసుకున్న టెంపర్ సినిమాను ఎన్టీఆర్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: