మంచు... విష్ణు శ్రీను వైట్ల కాంబినేషన్ మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించిన మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు తాజాగా జిన్నా అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి సూర్య దర్శకత్వం వహించగా , కోనా వెంకట్ ఈ మూవీ కి స్క్రీన్ ప్లే ను అందించాడు. ఈ మూవీ లో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్ ,  సన్నీ లియోన్ హీరోయిన్ లుగా నటించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి మూవీ యూనిట్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ,  వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

అక్టోబర్ 21 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వరస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా మంచు విష్ణు  ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా మంచు విష్ణు ,  శ్రీను వైట్ల తో సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పు కొచ్చాడు ... తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మంచు విష్ణు మాట్లాడుతూ ... తన తదుపరి మూవీ ఢీ అండ్ ఢీ – డబుల్ డోస్ అని ,  జనవరి 2023 చివరి లో రెగ్యులర్ షూట్‌ ను ప్రారంభించనున్నట్లు తాజాగా మంచు విష్ణు తెలియజేశారు.

మంచు విష్ణు ,  శ్రీను వైట్ల కాంబినేషన్ లో డి అండ్ డి డబల్ డోస్ అనే మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలం అవుతుంది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ సినిమా కు సంబంధించిన వార్తను మంచు విష్ణు చెప్పు కొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు జిన్నా మూవీ నుండి మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ,  ఈ మూవీ పై ప్రేక్షకులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలను పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: