మంచు విష్ణు "జిన్నా" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరో గా ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు ఆఖరు గా మోసగాళ్లు అనే మూవీ లో హీరో గా నటించాడు. మామూలు అంచనాల నడుమ విడుదల అయిన మోసగాళ్లు మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా మంచు విష్ణు "జిన్నా" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో మంచు విష్ణు సరసన సన్నీ లియోన్ ,  పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ కి సూర్య దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి మూవీ యూనిట్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ,  వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఇప్పటికే జిన్నా మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలను పెట్టుకున్నారు. మరి మోసగాళ్లు మూవీ తో ప్రేక్షకులను నిరాశ పరిచిన మంచి విష్ణు "జిన్నా" మూవీ తో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: