అయ్యో..అనసూయకు ఇంత అవమానం జరిగిందా..

Satvika
బుల్లితెరపై యాంకర్ అనసూయ హవాను కొనసాగిస్తుంది..ఒకవైపు షోలు,మరో వైపు సినిమాల తో ఫుల్ బిజీగా ఉందని తెలిసిందే..రంగస్థలం సినిమాతో మంచి ఫేమ్ ను సొంతం చేసుకుంది.ఆ తర్వాత కొన్ని కీలక పాత్రలలో నటించిన ఆమె నటన పరంగా మంచి మార్కులు వేయించుకుంది.. ఇప్పుడు కూడా తమిళ్ ,మలయాళ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజిగా ఉంది.సోషల్ మీడియాలో నెటిజెన్లు ఈ అమ్మడిపై చూపించే అటెన్షన్ మరే స్టార్ హీరోయిన్ పై చూపించారు. ఎందుకంటె ఈమె టాక్ షోస్ కంటే కాంట్రవర్సీలో ఎక్కువగా నిలవడమే ఇందుకు కారణం.. తాను సమయంలో దొరికినప్పుడు ఫ్యామిలీ తో టూర్ లు వెళుతుంది..అందుకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది.వాటికి ఎటువంటి కామెంట్లు వచ్చిన పెద్దగా పట్టించుకోదు..నా లైఫ్ నా ఇష్టం అని కొట్టి పడేస్తుంది.

ఇది ఇలా వుండగా ఇప్పుడు ఓ వార్త నెట్టింట చక్కర్లు కోడుతుంది..తాజాగా అనసూయ కుటుంబానికి బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురుకుంది. ఇటీవల ఫామిలీతో కలిసి బెంగళూరు వెళ్లిన ఈ యాంకర్, తిరిగి హైదరాబాద్ కి వచ్చేందుకు అలియన్స్ విమానాయ సంస్థలో ఫ్లైట్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు. టిక్కెట్లు పై 6:55 నిలకు అని ఉండగా, 6:10 గంటలకే ఫ్లైట్ అంటూ తమని పరిగెత్తించినట్లు వెల్లడించింది..

ఆ తర్వాత కూడా అమ్మడుకు షాక్ తగిలింది.ఎయిర్ పోర్ట్ కి చేరుకోగా ఫ్లైట్ అరగంట సేపు లేటుగా వచ్చింది, ఆ తర్వాత మాస్కులు లేనిదే విమానంలోనికి అనుమతించడం జరగదంటూ నిలువరించడం జరిగిందని. అయితే మాస్క్ తప్పనిసరి కాదని వాదించడంతో లోనికి అనుమతించిన, తమకి సంబంధిత సీట్లలో కాకుండా వేరువేరు సీట్లలో కూర్చోబెట్టారని, ఆ క్రమంలో సీటు సరిగ్గా లేకపోవడంతో తన బట్టలు కూడా చిరిగాయి అంటూ సోషల్ మీడియా ద్వారా ఆ ఎయిర్ లైన్స్ సంస్థ పై ఆగ్రహం వ్యక్తం చేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: