వైరల్ అవుతున్న ఆ సూసైడ్ నోట్ ...!!

murali krishna
రెండేళ్ల క్రితం ప్రముఖ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుట్ ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఘటన మన అందరిని ఎంతలా బాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇప్పటికి అతని వీడియో చూసిన, ఫోటో చూసిన మన కళ్ళలో నుండి నీళ్లు కూడా వచ్చేస్తాయి..ఈ బాధ నుండి ఇంకా తేరుకోక ముందే అతనికి ఎంతో సన్నిహితంగా ఉండే స్నేహితురాలు వైశాలి ఠక్కర్ కూడా ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ లో కలకలం రేపుతోందట.


వైశాలి ఠక్కర్ 2015 వ సంవత్సరం నుండి బుల్లితెర సీరియల్స్ లో అడుగుపెట్టిందట..సుమారు 9 సీరియల్స్ కి పైగా ఈమె బాలీవుడ్ లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది..అంతే కాకుండా ఈమె సోషల్ మీడియా లో కూడా మంచి పాపులర్ సెలబ్రిటీ..సుశాంత్ సింగ్ రాజపుట్ కి మంచి స్నేహితురాలు కూడా..30 ఏళ్ళ వయస్సు గల ఈమె నిన్న తన మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ నగరం లో తేజాజి నగర్ లోని తన స్వగృహం లో ఉరి వేసుకొని ఆత్మా హత్య చేసుకోవడం బాలీవుడ్ లో పెద్ద కలకలం సృష్టించిందట.


ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె రాసిన ఒక చివరి లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందట..ఆ లేఖలో ఆమె ఏమి రాసిందంటే 'రెండున్నర సంవత్సరాల నుండి తన పక్కింట్లో ఉంటున్న రాహుల్ అనే వ్యక్తి నన్ను మానసికంగా ఎంతగానో వేధిస్తున్నాడు..అమ్మా, నాన్న మరియు నేను చనిపోయిన తర్వాత అతడిని కఠినంగా శిక్షించండి..నా చావుకు అతడే కారణం' అంటూ ఆమె ఒక లేఖ రాసిందట..ఆ లేఖని స్వాధీన పరుచుకున్న మధ్య ప్రదేశ్ పోలీసులు..రాహుల్ ని మరియు అతని భార్య ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారట.



ఈ విచారణలో తేలిన విషయం ఏమిటి అంటే రాహుల్ వైశాలి కి మాజీ ప్రియుడు అని..ఆమెని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి..మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని..ఇప్పుడు రోజు తనని పక్కన ఉంటూనే వేధిస్తున్నాడని తెలిసిందట..ప్రస్తుతం వాళ్ళిద్దరిని విచారిస్తున్నామని..మరిన్ని విషయాలు త్వరలోనే మీడియా కి తెలియచేస్తాము అంటూ మధ్య ప్రదేశ్ పోలీసులు తెలిపారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: