నితిన్... వక్కంతం వంశీ మూవీ స్టార్ట్ కాబోయేది అప్పుడే..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు ఆయన నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నితిన్ ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ హీరో గా ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా ,  కృతి శెట్టి , క్యాథరిన్ ఈ మూవీ లో నితిన్ సరసన హీరోయిన్ లుగా నటించారు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన మాచర్ల నియోజకవర్గం మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే మాచర్ల నియోజకవర్గం మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహ పరిచిన నితిన్ ప్రస్తుతం తన తదుపరి మూవీ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నితిన్ తన తదుపరి మూవీ ని వక్కంతం వంశీ దర్శకత్వం లో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ నితిన్ కెరియర్ లో 32 వ మూవీ గా తెరకెక్కబోతోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నితిన్ , వక్కంతం వంశీ కాంబినేషన్ లో తేరకేక్కబోయే మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే వక్కంతం వంశీ చాలా సినిమాలకు కథలను అందించాడు.  వక్కంతం వంశీ , అల్లు అర్జున్ హీరోగా అను ఇమాన్యుల్ హీరోయిన్ గా  తెరకెక్కిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందు కోలేక పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: