మంచు విష్ణు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు..!!

murali krishna
మంచు విష్ణు మరియు పాయల్ రాజ్ పుత్ జంటగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జిన్నా. అక్టోబర్ 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచేశారట మేకర్స్


అందులో భాగంగా నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేడుకలో మోహన్ బాబు మాట్లాడుతూ.. 565 సినిమాలు.. 75 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాను.. ఏఎన్నార్, ఎన్టీఆర్, ఎంజీఆర్, కృష్ణ, కృష్ణంరాజు గారి ఫంక్షన్స్ లో నన్నెవ్వరుఇలా మాట్లాడు.. ఇంతసేపు మాట్లాడు అని చెప్పలేదు.. కానీ నా కొడుకు విష్ణు మాత్రం నాన్న నువ్వు ఈరోజు చాలా తక్కువ మాట్లాడు అని చెప్పుకొచ్చాడట.. అప్పుడు నాకే అనిపించింది అంత ఎక్కువ మాట్లాడుతున్నానా అని.. ఏదిఏమైనా ఆరోజులు వేరు.. ఈరోజులు వేరు. పురాణాల్లో చెప్పినట్లు మన గురించి మనం చెప్పుకోవాలి.. కానీ నా గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిడ్డలను పదిమందిలో పొగడకూడదు అనేది శాస్త్రం.. కానీ ఈ సినిమాలో విష్ణు చాలా అద్భుతంగా నటించాడు. ఎన్నో రిస్కీ షాట్స్కూడా చేశాడు. సినిమాలు చెయ్.. కానీ ఇకముందు ఎప్పుడు ఇలాంటి రిస్క్ లు చేయొద్దు.


దేవుడి దయతో ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమాకు ప్రాణం పోసింది కోన వెంకట్.. ఆ తర్వాత చోటా కె నాయుడు.. విష్ణు చోటా గురించి చెప్పినప్పుడు వాడికి పొగరు.. నాతో సినిమా చేసినప్పుడు కూడా.. కొంచెం అలాగే ఉండేది అని అంటే.. ఆలా ఏం లేదు చోటాగారు మంచివారు అని చెప్పడంతో ఒప్పుకున్నానని.. నిజం చెప్పాలి నా కొడుకును ఎంతో అందంగా చూపించాడు.. ఎంతో పనివంతుడు. ఇక అనూప్ సంగీతం హైలైట్.. నాతో సినిమా చేయమంటే చేయలేదు.. నేను హీరోగా పనికిరాను అనుకున్నాడేమో.. ఏదిఏమైనా విష్ణుకు, మా కుటుంబానికి మర్చిపోలేని ఆల్బమ్ ఇచ్చావ్.. థాంక్స్. డైరెక్టర్ సూర్య.. బాగా తీసాడు.. నీ ఓర్పు, సహనానికి మంచి ఫలితం వస్తుంది. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి చేశారు. సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను” అని తెలిపారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: