అల్లు అర్జున్ కోసం అల్లు స్డూడియోలో మార్పులు... ఎంత పెద్ద సెట్ వేస్తున్నారంటే !

murali krishna
ఆయన హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో 'పుష్ప' (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేశారు.
అది అలా ఉంటే పుష్ప ది రూల్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో అని.. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆయన ఫ్యాన్స్. మొన్నటి వరకు ఈ సినిమా దసరా తర్వాత షూటింగ్‌ను ప్రారంభించనుందని టాక్ నడిచింద
అల్లు ఫ్యామిలీ గండిపేట సమీపంలో ఓ పది ఎకరాల్లో కొత్తగా ఓ స్టూడియోను నిర్మించారు. ఇటీవలే ఈ స్టూడియోను మెగాస్టార్ చిరంజీవి ప్రారంబించిన విషయం తెలిసిందే. ఈ స్టూడియోలో పుష్ప2 షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నారు..
పుష్ప 2' పై భారీ అంచనాలు పెరిగిపోవడంతో ఈమూవీ కథలో ఇప్పటికే అనేక మార్పులు చేసిన సుకుమార్ ఈమూవీని సహజత్వం కోసం బ్యాంకాక్ ఫారెస్ట్ లోను అదేవిధంగా కెన్యా పర్వతాల పైనా ఈమూవీ షూటింగ్ ను తీయాలని సుకుమార్ భావించినట్లు తెలుస్తోంది.
అయితే దీనికి సంబంధించి బ్యాంకాక్ కెన్యా ప్రభుత్వాల నుండి అనుమతులు రావడంలో ఆలస్యం జరగడంతో పాటు బ్యాంకాక్ అరణ్యాలలో తరుచూ వానలు వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావడం ఆలస్యం అయ్యింది.
దీంతో 'పుష్ప 2' మరింత ఆలస్యం కాకూడదని అల్లు స్టూడియోస్ లో బ్యాంకాక్ అరణ్యాన్ని పోలినట్లుగా ఒక దట్టమైన కృత్రిమ అడవిని కెన్యా పర్వతాలను పోలినట్లుగా కృత్రిమ పర్వతాల సెట్ ను సుకుమార్ డిజైన్ చేయిస్తున్నట్లు టాక్.
ఈసినిమాకు సంబంధించి అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈమూవీ షూటింగ్ వచ్చేనెల ప్రారంభించి ఎక్కడా గ్యాప్ లేకుండా షూటింగ్ కొనసాగించి 6 నెలలలో ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే ఏడాది దసరా కు ఈమూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదలచేయాలని సుకుమార్ ప్లాన్ అని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో మొదటి భాగంలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా మాస్‌ లుక్‌లో కేక పెట్టించిన సంగతి తెలిసిందే. అయితే సీక్వెల్‌లో కూడా కొద్ది మార్పులతో అదే లుక్‌ను కొనసాగిస్తారట. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 125 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: