ఆటో జానీ కథ గురించి పూరి జగన్నాథ్ ను అడిగిన చిరంజీవి..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఇప్పటికే ఈ సంవత్సరం మొదటగా ఆచార్య మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టు కోలేక పోయింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి "గాడ్ ఫాదర్" మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ అక్టోబర్ 5 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరియు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు. ఇందులో భాగంగా వీరిద్దరూ అనేక ఆసక్తికరమైన విషయాలను ముచ్చటించుకున్నారు. ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి 150 వ మూవీ కోసం అనేక మంది దర్శకుల వెతుకులాటలో ఉండంగా ,  పూరి జగన్నాథ్ "ఆటో జానీ" అనే స్క్రిప్ట్ ను చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్లడం ,  దానిని చిరంజీవి ఓకే చేయడం ,  ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల చిరంజీవి ఆ స్క్రిప్ట్ ను పక్కన పెట్టేయడం జరిగాయి.

దానితో తాజా ఇంటర్వ్యూ లో చిరంజీవి ,  పూరి జగన్నాథ్ ని ...  నా ఆటో జానీ కథ ని ఏం చేశావు ...  ఉందా ...  లేదా అని పూరి జగన్నాథ్ ని అడిగాడు. దానితో పూరి జగన్నాథ్ ...  ఆటో జానీ కథను పక్కన పెట్టాను సార్ ... అంతకంటే మంచి కథను ఒకటి మీకోసం రాస్తున్నాను. మరి కొన్ని రోజుల్లోనే మీ దగ్గరికి వస్తాను అని చెప్పు కొచ్చాడు. ఇలా పూరి జగన్నా చెప్పడంతో వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ ఎప్పుడు ఉంటుందా ... అని మెగా అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: