"ఆర్ సి 15" మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చిన జానీ మాస్టర్..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులను ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. దర్శకుడు శంకర్ ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నాడు. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా అంజలి ,  సునీల్ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.

తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ కి చిత్ర బృందం ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ,  ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతూ ఉండటంతో ,  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది.  ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం కూడా ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక సాంగ్ కి జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ గా వ్యవహరించాడు.

అయితే తాజాగా జానీ మాస్టర్ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజాగా జానీ మాస్టర్ "ఆర్ సి 15" మూవీ గురించి స్పందిస్తూ ... ఆర్ సి 15 మూవీ లో ఒక సాంగ్ కి కొరియోగ్రఫీ చేశాను. తమన్ ఆ సాంగ్ కి అద్దరగొట్టే ట్యూన్ ను ఇచ్చాడు. ఆ సాంగ్ చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడు శంకర్ గారు ఒక అదిరిపోయే కాన్సెప్ట్ ఇచ్చారు. దానికి నేను చాలా ఆనంద పడ్డాను. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఈ సాంగ్ లో చూపించాను అని తాజాగా జానీ మాస్టర్ చెప్పు కొచ్చాడు. ఇది ఇలా ఉంటే పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉన్న రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: