సాయి ధరమ్ తేజ్ 15వ మూవీకి ఆ క్రేజీ మ్యూజిక్ దర్శనం డైరెక్టర్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ "పిల్ల నువ్వు లేని జీవితం" మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకొని ఫుల్ క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఆ తరువాత సుప్రీమ్ ,  సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి వరస మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్రేజీ హీరోగా మారిపోయాడు.
 

ఇది ఇలా ఉంటే సాయి ధరమ్ తేజ్ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన రిపబ్లిక్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ ,  ఈ మూవీ కి విమర్శకుల నుండి మాత్రం అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే సాయి దరమ్ తేజ్ తాజాగా తన కెరీర్ లో 15 వ మూవీ లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి  కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది.

ఈ మూవీ కి విక్రాంత్ రొనా , కంతార వంటి బ్లాక్ బాస్టర్ మూవీ లకు సంగీతాన్ని అందించిన అజనేష్ లోక్ నత్ సంగీత దర్శకుడిగా పని చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలా అజనేష్ లోక్ నత్ ,  సాయి ధరమ్ తేజ్ మూవీ కి సంగీతం అందించబోతూ ఉండగా ఈ మూవీ మ్యూజిక్ పై ప్రేక్షకుల్లో ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: