"డీజే టిల్లు 2" మూవీలో ఛాన్స్ కొట్టేసిన అనుపమ పరమేశ్వరన్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో యువ హీరోలలో ఒకరు అయిన సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఇప్పటివరకు తన కెరియర్ లో ఎన్నో మూవీ లలో నటించాడు. కానీ ఏ మూవీ తో రాని క్రేజ్ ఈ హీరో కు డీజే టిల్లు మూవీ తో వచ్చింది. డీజే టిల్లు మూవీ లో సిద్దు జొన్నలగడ్డ స్టైల్ ,  ఆటిట్యూడ్ , బాడీ లాంగ్వేజ్ ,  డైలాగ్ డెలివరీ అన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా సిద్దు జొన్నలగడ్డ కు కూడా అద్భుతమైన క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే డీజే టిల్లు మూవీ లో సిద్దు జొన్నలగడ్డ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.
 

ఈ మూవీ లో నేహా శెట్టి ...  రాధిక పాత్రలో నటించింది. రాధిక పాత్రలో నేహా శెట్టి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇది ఇలా ఉంటే డీజే టిల్లు మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో డీజే టిల్లు మూవీ కి సీక్వెల్ గా డీజే టిల్లు పార్ట్ 2 ను తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ధృవీకరించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సిద్దు జొన్నలగడ్డ సరసన నేహా శెట్టి నటించడం లేదు. డీజే టిల్లు పార్ట్ 2 లో సిద్దు జొన్నలగడ్డ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించబోయే అవకాశం ఉన్నట్లు గత కొన్ని రోజులుగా అనేక వార్తలు బయటకు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా సిద్దు జొన్నలగడ్డ తన ఇన్స్టా లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ "అట్లుంటది మనతోని" అని ట్యాగ్ లైన్  ఉన్న టీషర్ట్ ను ధరించిన ఫోటోను షేర్ చేశాడు. దానితో ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు సిద్దు జొన్నలగడ్డ హింట్ ఇచ్చినట్లు చర్చ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: