ఆదిపురుష్: కోలుకోలేని చిక్కుల్లో ప్రభాస్ ?

Purushottham Vinay
బాహుబలి మూవీతో ప్రభాస్  ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అప్పటినుంచి చేసే ప్రతి మూవీని పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తూ అలరిస్తున్నాడు ఈ మిస్టర్ పర్ ఫెక్ట్. అయితే బాహుబలి తర్వాత చేసిన సాహో, రాధేశ్యామ్ అంతగా సక్సెస్ తేలేకపోయాయి. డార్లింగ్ తో సహా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఆదిపురుష్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆ సినిమా గురించి ఒక్క అప్ డేట్ వచ్చినా చాలు అని ఎంతో ఎదురుచూశారు. అంతలా ఎదురుచూసిన వారికి ఇటీవల విడుదలైన ఆదిపురుష్ టీజర్ అభిమానులను ఆకట్టుకున్న సాధారణ ప్రేక్షకులను ఎంతగానో నిరాశపరిచిన విషయం తెలిసిందే.గతంలో ఏ సినిమాకి రానంత విమర్శలు ఈ సినిమాకి వచ్చాయి.తాజాగా ప్రభాస్ తోపాటు ఆదిపురుష్ చిత్రబృందానికి ఢిల్లీ హైకోర్టు సోమవారం (అక్టోబర్ 10) నోటీసులు జారీ చేసింది. ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసారని దాఖలైన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 


ఆదిపురుష్ టీజర్ లో ఓ వర్గం దేవుళ్లను తప్పుగా చూపారని న్యాయవాది రాజ్ గౌరవ్ పిటిషన్ దాఖలు చేశారు. రాముడిని క్రూరమైన ప్రతీకార రూపంగా చూపారని, సాంప్రదాయ చిత్రపటానికి విరుద్ధంగా రాముడిని చూపించారని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. రావణుడి పాత్ర చాలా భయంకరంగా ఉందని ఆయన ఆరోపించారు. అలాగే ఆదిపురుష్ మూవీ విడుదలను నిషేధించేలా స్టే ఇవ్వాల్సిందిగా పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారించిన ఢిల్లీ హైకోర్టు ఆదిపురుష్ మూవీకి నోటీసులు పంపించింది. పిటిషన్ దారుల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు నోటిసుల్లో పేర్కొంది.ఇది నిజంగా ప్రభాస్ కి ఇంకా అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్  అనే చెప్పాలి.మరి ఈ సమస్యల నుంచి ప్రభాస్ బయటపడి తన సినిమాకి ఎలాంటి అవాంతరాలు లేకుండా విడుదల చేస్తాడో లేదో చూడాలి. ఓం రౌత్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, సీతగా కృతి సనన్ మరియు లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: