మరో క్రేజీ మూవీలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక మందన..?

Pulgam Srinivas
నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కిరిక్ పార్టీ మూవీ తో కన్నడ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన విజయాన్ని మరియు అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ , ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఛలో మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకొని , అద్భుతమైన క్రేజ్ ని కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన రష్మిక మందన ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన వరస మూవీ లలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ని కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ మరో క్రేజీ పాన్ ఇండియా మూవీ లో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో మరి కొన్ని రోజుల్లో ఓ మూవీ ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన రష్మిక మందన ను హీరోయిన్ గ మూవీ యూనిట్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రష్మిక మందన కు ఈ మూవీ యూనిట్ కథను వినిపించగా , ఆ కథ బాగా నచ్చిన రష్మిక మందన వెంటనే ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా రష్మిక మందన మరో క్రేజీ మూవీ ఆఫర్ ను కొట్టేసినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: