అనసూయ శ్రీలంకకు ఎందుకు వెళ్లిందో చెప్పిన జబర్దస్త్ శ్రీ సత్య..
అయితే శ్రీ సత్య ఇప్పుడు స్పెషల్ ఈవెంట్లు, షోలు చేస్తూ బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో మరింత సందడి చేస్తోంది. సినిమాల్లోనూ సత్య ట్రై చేస్తోన్నట్టుంది. ఇక సత్య ఫోటో షూట్లు, నెట్టింట్లో షేర్ చేసే పోస్టులు వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో మొదటి సారిగా తాను హోస్ట్ చేసిన షో గురించి చెప్పింది. శ్రీలంకలో ఓ ఈవెంట్ జరిగిందట. తాను మొదటి సారిగా ఆ షోను హోస్ట్ చేసిందట. ఈ ఈవెంట్లో అనసూయ మెరిసిందని చెప్పుకొచ్చింది. ఇక అనసూయతో కలిసి దిగిన ఫోటోలను శ్రీ సత్య షేర్ చేసింది.
ఈవెంట్లో అనసూయ తన భర్త సుశాంక్తో పాటుగా కనిపించింది. అంతేకాకుండా ఈ ఈవెంట్లో కండక్టర్ ఝాన్సీ కూడా కనిపిస్తోంది. మళ్లీ అదే పల్సర్ బైక్ స్టెప్పులు, అదే క్యాస్టూమ్తో కనిపిస్తోంది. ఇక శ్రీలంకలోనూ ఝాన్సీ అవే స్టెప్పులు వేసినట్టుంది. మొత్తానికి ఈ ఫోటోలు మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ సత్య, అనసూయ ఇలా ఇద్దరూ చీరకట్టులో ఎంతో సంప్రదాయబద్దంగా కనిపించారు.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది..