విలన్ గా మారిన స్టార్ డైరెక్టర్...!!

murali krishna
జాతీయ అవార్డు మూవీ మలయాళం లో వచ్చిన ట్రాన్స్ మూవీ లో అత్యుత్తమ నటనతో ఆకట్టుకున్న తమిళ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక ఈ చిత్రంలో కథానాయకుడు ఫహాధ్ ఫాజిల్ ను ఇబ్బంది పెట్టే విధంగా గౌతమ్ మీనన్ చాలా చక్కటి నటనతో మెప్పించాడు. ఇక గౌతమ్ మీనన్ ఇటీవల నటుడుగా కూడా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈయన మరొకసారి తన విలనిజాన్ని చూపించడానికి సిద్ధమయ్యారు. తాజా సమాచారం ప్రకారం లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్న దళపతి 67 లో విలన్ గా నటించడానికి గౌతం మీనన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక నిజానికి కేజీఎఫ్ విలన్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే సంజయ్ దత్, గౌతమ్ మీనన్ ఇద్దరిలో ఎవరు విలన్ గా భాగస్వామ్యం కానున్నారు తెలియాల్సి ఉంది..
ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన అన్ని అప్డేట్లు కూడా మరో రెండు నెలల్లో బయటకు వచ్చే అవకాశం ఉందని ఇటీవల లోకేష్ కనగరాజు వెల్లడించారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఎక్కువగా ఆయన సినిమాల్లో నటిస్తూ నటుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న దళపతి 67 సినిమాను తెర. ఈ సినిమాను కేజీఎఫ్ సినిమాను మించి గ్రాండ్ విజువల్ తో తెరకెక్కించాలని భారీ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం.
మరి ఈ సినిమాలో గౌతమ్ మీనన్ విలన్ గా తన నటనను ఎలా కనబరుస్తారని సినీ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే గౌతమ్ మీనన్ నటన విలన్ గా మరొకసారి చూడడానికి సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు సినిమా ప్రముఖులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్ పైకి వెళ్లనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: