వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ అభిమానుల దృష్టంతా కూడా ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమ హీరో చేస్తున్న సినిమా మీదే ఉంది. ఇంతకుముందు మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన అతడు, ఖలేజా సినిమాలు ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఖలేజా ఫ్లాప్ అయినా కూడా ఆ సినిమాకి అభిమానులు వున్నారు.అయితే ఈ రెండు చిత్రాలు కూడా టీవీల్లో తెగ ఆడేశాయి. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. వీటికి ఉన్న రిపీట్ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. ఐతే ఖలేజా తర్వాత సుదీర్ఘ కాలానికి జత కడుతున్న మహేష్, త్రివిక్రమ్ నుంచి ఈసారి అతడు, ఖలేజాల క్లాసిక్ టచ్ మాత్రమే కాక బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ కూడా ఆశిస్తున్నారు అభిమానులు.సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లిన సంగతి తెలిసిందే.
రామోజీ ఫిలిం సిటీలో భారీ యాక్షన్ ఘట్టంతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఐతే షూట్ మొదలైన కొన్ని రోజులకే ఒక విశేషాన్ని అభిమానులతో పంచుకోబోతున్నారు. ఈ సినిమా టైటిల్ను దసరాకే ప్రకటించేయబోతున్నట్లు సమాచారం. ఖలేజా టైటిల్ ప్రకటన విషయంలో చాలా జాప్యం జరగడంపై అప్పట్లో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.కానీ ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ చాలా శ్రద్దగా అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటూ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.కాగా మహేష్-త్రివిక్రమ్ కొత్త సినిమాకు ఉన్న క్రేజ్ను ప్రమోషన్ల ద్వారా పీక్స్కు తీసుకెళ్లే క్రమంలో ముందే టైటిల్ ప్రకటించి వైరల్ చేయాలని, ఆ తర్వాత కూడా సమయానుకూలంగా అప్డేట్స్ ఇస్తూ అభిమానులను ఎంగేజ్ చేయాలని డిసైడయ్యారు. పాన్ ఇండియా లెవెల్లో అందరికీ కనెక్ట్ అయ్యేలా టైటిల్ ఉంటుందని దసరా రోజు చిన్న టీజర్తో పేరు ప్రకటిస్తారని సమాచారం తెలుస్తుంది.