ఏమాయ చేసావే సినిమాని వదులుకున్న స్టార్ హీరో.. కారణం..?

Divya
డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేసావే సినిమా వెండితెరపై ఎంతటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంలో నాగచైతన్య, సమంత జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కించి యువతను బాగా ఆకట్టుకున్నారు. ఈ సినిమా తమిళంలో కూడా హీరో శింబు, త్రిష తెరకెక్కించారు అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఎన్ని భాషలలో తీసిన కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఏమాయ చేసావే సినిమా స్క్రిప్టును రాసిన సమయంలో ముందుగా హీరోగా నాగచైతన్య అని అనుకోలేదట డైరెక్టర్ గౌతమ్ మీనన్.. మొదట మహేష్ బాబుని హీరోగా తీసుకోవాలని అనుకున్నాడు కానీ మహేష్ బాబు అప్పటికి పోకిరి సినిమా తో భారీ విజయాన్ని అందుకోవడంతో.. అభిమానులు కూడా ఈ హీరోని మాస్ హీరోగా కూడా గుర్తించారు. ఏమాయ చేసావే సినిమా ఒక క్లాసికల్ గా ఉండడంతో ఈ సినిమాని మహేష్ బాబు ఒప్పుకోలేదు అన్నట్లుగా సమాచారం. దీంతో అలా సమంత నాగచైతన్య నటించాల్సి వచ్చింది అని గౌతమ్ మీనన్ తెలిపారు.
ఓకే రంగానికి చెందిన వాళ్లు వివాహం చేసుకోవచ్చా అనే ప్రశ్న గౌతమ్ మీనన్ కు ఎదురవ్వగా.. ఇద్దరు కలవడానికి లేదా విడిపోవడానికి రూల్స్ అనేవి ఎలాంటి అడ్డు ఉండవు.. బంధంలో ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకునేందుకు ఇద్దరు కలిసి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి.. కేవలం రెండు మనసులు కలిస్తే చాలు ఒకే రంగానికి చెందినవారు వివాహం చేసుకోవచ్చు అని గౌతమ్ మీనన్ తన మనసులో మాటగా తెలియజేశారు. ఇక ఈ డైరెక్టర్ పలు సినిమాలలో కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉంటారు. తాజాగా సీతారామ సినిమాలో కూడా నటించడం జరిగింది. ఒకవైపు డైరెక్టర్గా మరొకవైపు నటుడుగా తన కెరీర్ ని ముందుకు సాగిస్తున్నారు గౌతమ్ మీనన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: