'లైగర్' మూవీ నటీనటుల రెమ్యూనిరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
విజయ్ దేవరకొండ హీరో గా అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తాజాగా లైగర్ అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని పూరి కనెక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లపై పూరి జగన్నాథ్ , మరియు కరన్ జోహార్ లు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ లో మైక్ టైసన్ ఒక కీలకమైన పాత్రలో నటించగా , రమ్య కృష్ణ ఈ మూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించింది. భారీ అంచనాల నడుమ తాజాగా ఆగస్టు 25 వ తేదీన ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ , హిందీ , కన్నడ , మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా కోసం ఈ మూవీ లో నటించిన నటీ నటులు తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కోసం ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ ఏకంగా 35 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్నాడు అని , ఈ మూవీ లో హీరోయిన్ గా నటించిన అనన్య పాండే ఈ మూవీ కోసం మూడు కోట్ల రెమ్యూనికేషన్ తీసుకున్నట్లు , ఈ మూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించిన రమ్య కృష్ణ ఈ మూవీ కోసం కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంది అని ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ మూవీ ని దర్శకుడు పూరి జగన్నాథ్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: