శ్రీను వైట్ల ఎమోషనల్.. నెట్టింట్లో పోస్ట్ వైరల్..!!

Anilkumar
టాలీవుడ్ డైరెక్టర్ శ్రీనువైట్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఈయన తీసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే సినిమాలు చేసి మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నాడు.అయితే టాలీవుడ్ దర్శకుడు శ్రీనువైట్ల, కాస్ట్యూమ్ డిజైనర్ రూప దంపతులకు ముగ్గురు కుమార్తెలు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే గతంలో శ్రీను వైట్ల తన భార్య రూప ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తలు వైరల్ అయినప్పటికీ ఆ విషయంపై శ్రీనువైట్ల స్పందిస్తూ.. నా ముగ్గురు కూతుర్లు, నా భార్యను వదిలి నేను ఉండలేను. 

అంతేకాదు దయచేసి రూమర్ క్రియేట్ చేయకండి అంటూ మీడియా వారిపై కూడా మండిపడ్డాడు.ఇక  దీన్ని బట్టి చూస్తే ఆయనకు తన భార్య, పిల్లలపైన ఎంత ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.అయితే ఏ విషయంపై పెద్దగా స్పందించని శ్రీను వైట్ల ఇటీవల సోషల్ మీడియా ద్వారా తన బాధను వ్యక్తం చేశాడు.ఇక  అంతేకాదు బరువెక్కిన హృదయంతో వీడ్కోలు పలుకుతూ ఈయన చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోతే అసలు విషయంలోకి వెళితే.. శ్రీనువైట్ల పెద్ద కూతురు అమెరికాకు చదువుల కోసం బయలుదేరింది. అంతేకాదు ఎయిర్ పోర్ట్ లో కుమార్తెను బరువెక్కిన హృదయంతో వీడ్కోలు పలుకుతున్న వీడియోను..

శ్రీనువైట్ల అభిమానులతో పంచుకున్నారు.అయితే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ పూర్తి చేసేందుకు నా పెద్ద కూతురు అమెరికా వెళ్ళింది.పోతే  ఓ తండ్రిగా ఎంతో వేదన కలిగింది ఇదే వయసులో నేను చెన్నై వెళ్తుంటే ఆనాడు మా నాన్న ఎంత బాధపడి ఉంటాడో ఇప్పుడు అర్థమవుతుంది. ఇక జీవితం ఒక చక్రం లాంటిది.. నా గారాల పట్టి ఆనంది తండ్రిని గర్వించేలా చేస్తుందని గట్టి నమ్మకం ఉంది.. అంటూ ఆయన తన పోస్ట్ ద్వారా తెలిపారు.ఇక  ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: