డైరెక్టర్ శంకర్ వల్ల సంచల నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్..?

Anilkumar
ఇటీవల రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.అంతేకాదు చరణ్ శంకర్ కాంబో మూవీ షూట్ పూర్తైన తర్వాతే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని ప్రచారం జరిగింది.ఇక శంకర్ భారతీయుడు2 సినిమా షూటింగ్ తో బిజీ కావడంతో అతి త్వరలో చరణ్ గౌతమ్ కాంబో మూవీ షూట్ మొదలుకానుందని సమాచారం అందుతోంది.అయితే  గౌతమ్ సినిమాపై చరణ్ దృష్టి పెట్టారని బోగట్టా.అంతేకాదు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు.కాగా  కొత్త తరహా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

ఇకపోతే  కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ఈ ఏడాది విడుదలైన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ అద్భుతమైన నటనకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో ప్రశంసలు దక్కాయి.కాగా  ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో కమల్ హాసన్ తర్వాత సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇకపోతే భారతీయుడు2 సినిమాకు ఊహించని స్థాయిలో బిజినెస్ ఆఫర్లు రావడంతో శంకర్ ఈ సినిమాపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం అందుతోంది.అంతేకాదు  శంకర్ కోరిక మేరకు తమ సినిమా షూటింగ్ ను వాయిదా వేసుకోవడానికి రామ్ చరణ్,

 దిల్ రాజు అంగీకరించారని బోగట్టా. ఇదిలావుంటే మరోవైపు రామ్ చరణ్ వేగంగా సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఇక  ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తో చరణ్ పారితోషికం అంచనాలకు మించి పెరిగింది.ఇకపోతే చరణ్ ఒక్కో ప్రాజెక్ట్ కు 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. అయితే రామ్ చరణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా పాన్ ఇండియా రికార్డులను సాధించాలని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలతో పాటు చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: