కార్తికేయ2: US లో హవా.. మాములుగా లేదుగా?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన 'కార్తికేయ'కు సీక్వెల్ గా వచ్చిన చిత్రం 'కార్తికేయ 2'. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ మైథలాజికల్ ఫిల్మ్ లో నిఖిల్ - అనుపమా పరమేశ్వరన్ కలిసి జంటగా నటించారు.అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఇంకా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. ఆగస్టు 13 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కార్తీకేయ 2'కు ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. బలమైన కథ, నిఖిల్ నటన ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ కు ఆడియెన్స్ బాగా ఫిదా అవుతున్నారు. అయితే ఈ చిత్రం ఇక వసూళ్ల పరంగా కూడా పర్లేదు అనిపించుకుంటోంది. రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే ఈ సినిమా సేఫ్ జోన్ దగర్లోకి వచ్చింది. ఈ రోజుతో బ్రేక్ ఈవెన్ ను కూడా పూర్తి చేసుకోనున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.రెండు రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా రూ.10 కోట్ల మేర షేర్స్ ను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.13 కోట్టు అవడంతో ఈ రోజు బ్రేక్ ఈవెన్ కూడా పూర్తయ్యి ఇక రేపటి నుంచి లాభాల బాటలో పయనించనుంది. ఇదిలా ఉంటే.. అటు యూఎస్ బాక్సాఫీస్ వద్ద 'కార్తీకేయ 2' సినిమా సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది.


రీసెంట్ గా వచ్చిన చిత్రాల్లో ఈ మూవీ మంచి రెస్పాన్స్ తో ఇంకా అసలైన వసూళ్లతో దూసుకుపోతోందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి తొలిరోజు యూఎస్ లో సాలిడ్ ఓపెన్సింగ్స్ రాగా.. తాజాగా యూఎస్ఏ లో మొత్తం 1000కి పైగా షోస్ అమ్ముడు పోయాయి. కేవలం రెండు రోజుల్లోనే 4.5 లక్షల డాలర్ల గ్రాస్ ఈ సినిమా  రాబట్టింది. ఇంకా అలాగే కాసుల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి దూకుడు ప్రదర్శిస్తోంది.ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లే దొరకని, తదితర సమస్యల్ని ఎదుర్కొని కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తుండటం విశేషం. ఇటు తెలుగు స్టేట్స్, అటు ఓవర్సీస్ లో కూడా నిఖిల్ 'కార్తీకేయ 2'తో తన మార్క్ చూపిస్తున్నాడు. అయితే తమకు ఇంతటీ సక్సెస్ ను అందిస్తున్న ప్రేక్షకులకు ఇంకా ముఖ్యంగా యూఎస్ లోని ఇండియన్ ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రస్తుతం కార్తీకేయ 2 సినిమాకు ఏ చిత్రం పోటీలో లేదు. మరో పది రోజుల వరకు కూడా హవా మొత్తం ఈ చిత్రానిదే. ఆగస్టు 25 వ తేదీన 'లైగర్' సినిమా రిలీజ్ తో కాస్తా జోరు తగ్గే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: