'సీతా రామం' థాంక్యూ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేయనున్న టాలీవుడ్ స్టార్ హీరో..!

Pulgam Srinivas
వెండితెర పై ప్రేమ కథలను అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు అనే పేరు కలిగిన దర్శకుడు హను రాఘవపూడి తాజాగా సీతా రామం అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా మృణాళిని ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో రష్మిక మందన ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా , సుమంత్ , భూమిక చావ్లా , తరుణ్ భాస్కర్ , గౌతమ్ వాసుదేవ్ మీనన్  ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ప్రియదర్శి , మురళి శర్మ , ప్రకాష్ రాజ్ సునీల్ ఈ మూవీలో మరికొన్ని ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ మూవీ నఆగస్ట్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకుంది.
 

మరీ ముఖ్యంగా ఈ మూవీ లో మెయిన్ లీడ్ పాత్రలో నటించిన దుల్కర్ సల్మాన్ , మృణాళిని ఠాకూర్ వచ్చే సన్నివేశాలు ప్రతి ఒక్కరికి నచ్చే విదంగా అద్భుతంగా ఉన్నాయి అంటూ ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అలాగే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా అద్భుతమైన కలెక్షన్  లను వసూలు చేస్తోంది. ఇలా సక్సెస్ ఫుల్ గా  బ్లాక్ బస్టర్ విజయం వైపు సీతా రామం మూవీ దూసుకుపోతోంది. ఇలా ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈ రోజు ఈ మూవీ యూనిట్ థాంక్యూ మీట్ ను ఏర్పాటు చేసింది. థాంక్యూ మీట్ హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో ఈరోజు మధ్యాహ్నం ప్రారంభం కానుంది. థాంక్యూ మీకు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ విషయాన్ని తాజాగా మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: