నిర్మాతలే టాలీవుడ్ నాశనానికి కారణం: తమ్మారెడ్డి భరద్వాజ

Purushottham Vinay
ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ షూటింగులు నిలిపివేయాలని నిర్ణయం కూడా తీసుకుంది.అయితే ఇక ఈ సంక్షోభానికి నిర్మాతలే కారణమని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆరోపించారు. ప్రస్తుతం సినిమా పరిశ్రమ అనేది వక్రమార్గం తీసుకుందని తమ్మారెడ్డి అన్నారు.ఇంకా గత ఐదేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమ రూపురేఖలే మారిపోయాయని.. ముఖ్యంగా చెప్పాలంటే బాహుబలి సినిమా తర్వాత అయితే నిర్మాతల ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. హీరోల రెమ్యునరేషన్‌లలో కూడా చాలా మార్పులు వచ్చాయన్నారు. ఇక నిర్మాతలకు లాభాలు వస్తే వందల కోట్లలో వస్తున్నాయని.. అలాగే నష్టాలు వస్తే నిండా మునిగిపోతున్న పరిస్థితులు అనేవి నెలకొన్నాయన్నారు. ఎప్పుడైతే డబ్బులు ఎక్కువ రావడం మొదలుపెట్టాయో అప్పుడు కంట్రోల్ తప్పిందన్నారు. థియేట్రికల్ బిజినెస్ అనేది తగ్గుతూ వస్తోందని.. ఓటీటీ బిజినెస్‌ను ఈ నిర్మాతలే పెంచేశారని తమ్మారెడ్డి వివరించారు.ప్రస్తుతం తెలుగు సినిమా క్వాలిటీ ఇంకా కంటెంట్ పడిపోయిందని తమ్మారెడ్డి చెప్పారు. సోకుల మీద పెడుతున్న ఖర్చు నిర్మాతలు సినిమాలో విషయంపై ఎందుకు పెట్టడం లేదని ఆరోపించారు.


కొందరు నిర్మాతలు ఏ సినిమా తీస్తున్నారో అసలు వారికి కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. ఇంకా కొందరు నిర్మాతల ఏకఛత్రాధిపత్యంతో సినిమా పరిశ్రమ దిగజారిపోయే పరిస్థితికి వచ్చిందన్నారు. నిర్మాతల మండలిలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ విలీనం కావడం చాలా అవసరమన్నారు. సినిమా కార్మికులు కేవలం సినిమాపైనే ఆధారపడటం లేదని ఇంకా వాళ్లకు ఓటీటీలు ఉన్నాయి.. టీవీలు ఉన్నాయని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. కార్మికులు అయితే పూర్తిగా రోడ్డు మీదకు వచ్చే పరిస్థితులు ప్రస్తుతం లేవన్నారు. గతంలో సినిమా షూటింగులు బంద్ అయితే కార్మికుల జీవితాలు బాగా నాశనం అయ్యేవని.. ఇప్పుడా పరిస్థితి లేదని కూడా వివరించారు. మన సినీ పరిశ్రమ సేఫ్‌గా ఉండాలంటే సినిమా టిక్కెట్ రేట్లు పెంచాల్సిన అవసరం లేదన్నారు. ఇంకా మంచి సినిమాలు రావాలని.. అవి ప్రేక్షకులకు అందుబాటు ధరల్లో ఉండాలని కూడా తమ్మారెడ్డి అన్నారు.ఇక అడ్డగోలుగా సినిమాల టిక్కెట్ రేట్లు పెంచడం వల్ల యూత్‌ను ఇంకా ఫ్యామిలీలను సినిమాల నుంచి దూరం చేసుకున్న పరిస్థితి ప్రస్తుతం ఉందని తమ్మారెడ్డి అన్నారు.


సినిమాలో దమ్ముంటే ఎక్కువ మందికి ఆ సినిమా చూపించి వసూళ్లు రాబట్టాలని ఆయన తెలిపారు. జనం ఎందుకు థియేటర్లకు రావడం లేదో నిర్మాతలు ఖచ్చితంగా ఆలోచించాలన్నారు. కొందరు నటుల గొంతెమ్మ కోరికల కారణంగా ఖర్చు తడిచి బాగా మోపెడు అవుతుందన్నారు. సినిమా అంటే ప్యాషన్‌గా చూడాలని అంతేగాని బిజినెస్‌గా చూస్తే అది నాశనం కాక మానదన్నారు. పాన్ ఇండియా పేరుతో నిర్మాతలకు బలుపు వచ్చి బాగా విర్రవీగుతున్నారన్నారు. బడ్జెట్ పెంచి టిక్కెట్ల ధరలు పెంచడం అసలు సబబు కాదన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు దేశమంతటా కూడా ఉన్నాయని కాకపోతే మనోళ్లు కొంచెం ముందుగా కళ్లు తెరిచారని తమ్మారెడ్డి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: