షంషేరా: బాలీవుడ్ కి మరో హిట్ దక్కినట్లేనా?

Purushottham Vinay
బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ హీరోగా సీనియర్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటించిన షంషేరా సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. తొలి ఆట నుంచి ఈ సినిమాకు మంచి టాక్ అనేది వినిపిస్తుంది.ఇక ఇప్పటికే ఈ మూవీని చూసినవారు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని పుష్ఫ ఇంకా అలాగే సూర్యవంశి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో పోలుస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా బాలీవుడ్ లో పాత రికార్డులు బద్ధలు కొట్టి బాలీవుడ్ బాక్సాఫిస్‌లో రికార్డులను తిరగరాస్తుందని మరికొందరు పోస్ట్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా కథలోకి వెళితే.. ఓ గిరిజన జాతిని దరోగ శుద్ధ సింగ్ జైళ్లో బంధిస్తాడు. ఇక వాళ్లను విడిపంచుకోవడానికి వచ్చిన వీరుడే ఈ షంషేరా. హీరో షంషేరా పాత్రలో రన్బీర్ కపూర్ ఇంకా అలాగే విలన్ శుద్ధ్ సింగగా సంజయ్ దత చాలా బాగా అదరగొట్టారు. నువ్వా నేనా అంటూ సినిమాలో ఇద్దరిమధ్య భీకరమైన యుద్ధం అనేది కూడా నడుస్తుంది.


అయితే ఇక షంషేరా సినిమాలో యాక్షన్, కామెడీ, ఎమోషన్ ఇంకా అలాగే రొమాన్స్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ కూడా ఉన్నట్లు సోషల్ మీడియా రివ్యూలో పేర్కొంటున్నారు.ఇక కరణ్ మల్హోత్రా ఈ సినిమాకి దర్శత్వం వహించగా బాలీవుడ్ మెలోడీ కింగ్ మిథూన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ సినిమాని నిర్మించారు. మొత్తం 150 కోట్ల భారీ బడ్జెట్ తో బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 600 కోట్లు కలెక్ట్ చేస్తుందని బాలీవుడ్ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఇక వరుస ప్లాపులతో సతమతం అవుతున్న బాలీవుడ్ కి ఈ సినిమా రూపంలో అయితే ఊరటనిచ్చే మంచి హిట్ దక్కింది.మరి చూడాలి ఈ సినిమా ఇక ఎన్ని కోట్లు వసూళ్లు సాధిస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: