అల్లు అర్జున్ పై కన్నేసిన తమిళ దర్శకుడు..?

Anilkumar
స్టార్ డైరెక్టర్ లింగుస్వామి తెలుగు హీరోలపై కన్నేసిన  సంగతి తెలిసిందే. అయితే తాజా గాజువాక హీరో రామ్ తో "ది వారియర్" సినిమా చేస్తున్న లింగస్వామి తాజాగా ఇప్పుడు మరొక టాలీవుడ్ హీరో తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇకపోతే ఆ హీరో మరెవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న లింగుస్వామి తన తదుపరి ప్రాజెక్టుల గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు. కాగా బన్నీతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటానని కథల గురించి మాట్లాడతామని చెప్పారు లింగుస్వామి.ఇదిలావుంటే "15 రోజులు క్రితమే బన్నీని కలిసి మాట్లాడాను.

ఇక మా ఇద్దరి కాంబినేషన్లో ఖచ్చితంగా సినిమా వస్తుంది," అని చెప్పారు లింగుస్వామి. అంతేకాదు మాస్ ఇమేజ్ ఉన్న లింగు స్వామి డైరెక్షన్లో బన్నీ సినిమా చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే మరోవైపు "పుష్ప: ది రూల్" సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ మరే సినిమాకి సైన్ చేయలేదు. ఇక  ప్రస్తుతం ఇప్పుడు  ఈ మధ్యకాలంలో ఒక్క హిట్ సినిమా కూడా లేని లింగు స్వామి మాత్రం "వారియర్" పైన తన ఆశలన్నీ పెట్టుకున్నారు. పోతే ఈ సినిమా కనుక మంచి విజయాన్ని సాధిస్తే బన్నీ లింగుస్వామితో సినిమా చేసేందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారని చెప్పుకోవచ్చు.

ఇక పుష్ప సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న బన్నీ ...ఇప్పుడు పుష్ప2 తో బిజీ గా ఉన్నాడు.పుష్ప పార్ట్ 2 షూటింగ్ ఇప్పటికే పట్టాలెక్కాలి కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల షూటింగ్ మొదలవలేదు. అయితే అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. ఇప్పటికే సుకుమార్ పార్ట్ 2 కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసినట్లు సమాచారం. ఆగస్టు మొదటి వారంలో పుష్ప పార్ట్ టు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక సినిమాని వచ్చే ఏడాది వేసవి నాటికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: