పవిత్ర లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె భర్త...!!

murali krishna
పవిత్ర లోకేష్, నరేష్.. ప్రస్తుతం వీళ్ల గురించే ఇండస్ట్రీలో బాగా చర్చనీయాంశం అయింది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్


నాలుగో పెళ్లి చేసుకున్నారని.. అది కూడా పవిత్ర లోకేశ్ అనే తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తనకు విడాకులు ఇవ్వకుండా వేరే పెళ్లి చేసుకోవడం ఏంటి అని నరేష్ మూడో భార్య రమ్య ఆరోపణలు చేస్తున్న విషయమూ తెలిసిందే. అలాగే.. మైసూర్ లోని ఓ హోటల్ లో నరేష్, పవిత్ర ఇద్దరూ కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా రమ్య వాళ్లకు పట్టుకుంది. దీంతో రమ్య తనను మోసం చేసిందని.. తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని, డబ్బులు డిమాండ్ చేస్తోందంటూ నరేష్ కూడా రమ్యపై ఆరోపణలు కూడా చేశాడు.


ఈనేపథ్యంలో పవిత్ర లోకేశ్ మొదటి భర్త సుచేంద్ర ప్రసాద్ కూడా లైన్ లోకి వచ్చేశాడు. అసలు ఆయన ఎవరో.. పవిత్రకు ఇంతకుముందు పెళ్లి అయిందా లేదా అనే విషయం కూడా చాలా మందికి కూడా తెలియదు. వీళ్లిద్దరికి 2007 లోనే పెళ్లి అయింది. అయితే.. సుచేంద్ర ప్రసాద్ కు పవిత్రతో రెండో పెళ్లి జరిగింది. తనకు ఇదివరకే మల్లిక అనే మహిళతో వివాహం జరిగినా.. 2007 లో మల్లికకు.. సుచేంద్ర ప్రసాద్ విడాకులు ఇచ్చాడు.ఆ తర్వాత పవిత్రను పెళ్లి చేసుకున్నాడట.వీళ్లకు ఒక కొడుకు, కూతురు కూడా ఉన్నారు. తర్వాత ఇద్దరూ విడిపోయారు.


మా పెళ్లిని రిజిస్టర్ చేసుకోకపోవడమే నేను చేసిన తప్పు ఇప్పుడు వేర్వేరుగా ఉంటున్నాం. కానీ.. అసలు మేము పెళ్లి చేసుకున్నట్టు.. మా పెళ్లిని రిజిస్టర్ చేసిన ప్రూఫ్ ఏదీ కూడా లేదు. అప్పుడు రిజిస్టర్ చేయాలని కూడా అనుకోలేదు. చట్టబద్ధంగానే మా పెళ్లి జరిగినా.. దానికి ప్రూఫ్ అంటూ ఏదీ లేదు. అందుకే.. మా పెళ్లికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికెట్ ఏదీ లేదని ఆయన మీడియాకు చెప్పాడు. ఇదెలా ఉంటే.. పవిత్ర లోకేశ్ మాత్రం.. అసలు తనను సుచేంద్ర పెళ్లి చేసుకోలేదని.. అదంతా అబద్ధం అని చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో అసలు ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో తెలుగు ప్రేక్షకులకు అర్థం కావడం లేదట.మరోవైపు నరేష్, పవిత్ర ఇద్దరు మాత్రం ఇప్పుడు కలిసే ఉంటున్నారని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: