అతడు సినిమాను వదులుకున్న ఉదయ్ కిరణ్...!!
ప్రముఖ సీనియర్ నటుడు మురళి మోహన్ నిర్మాతగా మారి తెరకెక్కించిన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయితే ఏమి కాదు..కానీ ఒక మంచి సినిమా గా..టాలీవుడ్ లో ఆల్ టైం క్లాసిక్ సినిమాలలో ఒకటిగా సరికొత్త చరిత్ర ని సృష్టించింది ఈ సినిమా..ముఖ్యంగా బుల్లితెర మీద ఈ మూవీ బంపర్ హిట్..ఇప్పటికి కూడా ఈ సినిమా టీవీ లో వస్తే ప్రేక్షకులు టీవీ లకు అతుక్కుపొయ్యి మరి చూస్తారు..అయితే ఈ సినిమాని మొదట ఉదయకిరణ్ తో తెరకెక్కించాలని అనుకున్నాడట ఆ చిత్ర నిర్మాత మురళి మోహన్..ఇటీవల ఆయన ఇచ్చిన ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ లో ఈ విషయాన్నీ పంచుకున్నాడట.
మురళి మోహన్ మాట్లాడుతూ 'ఉదయ్ కిరణ్ మొదటి సినిమా చూసి ఈ అబ్బాయి ఎవరో చాల బాగున్నాడు..బుద్దిమంతుడు లాగ ఉన్నాడు..చాల బాగా నటించాడు..ఒకసారి మాట్లాడుదాం అని ఫోన్ చేసి అభినందనలు కూడా తెలిపాను..అప్పుడు ఉదయ్ కిరణ్ మీరు నాకు ఫోన్ చెయ్యడం చాల అనందం గా ఉంది అండీ..ఒక్కసారి ఇంటికి వచ్చి కలిసాడు..అప్పటి నుండి తరచు ఇంటికి వస్తుండేవాడు..ఇంకా చెప్పాలంటే అతడు సినిమాని మొదట హీరోగా అనుకున్నది కూడా ఉదయకిరణ్ నే..అడగగానే దానికంటే భాగ్యమా కచ్చితంగా చేస్తాను అని చెప్పాడు..కానీ ఆ సమయం లోనే చిరంజీవి గారి కూతురుతో పెళ్లి నిశ్చయం అవ్వడం..ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల మనిషి బాగా తికమకి కి గురయ్యాడట...అతడు సినిమా డేట్స్ కోసం కాల్ చేస్తే సారి అండీ..డేట్లు సర్దుబాటు చెయ్యలేకున్నాను..వేరే వాళ్లకి ఇచ్చి ఉన్నాను అని చెప్పాడట.అప్పుడు మేము మహేష్ బాబు తో తీసాము' అంటూ చెప్పుకొచ్చాడట మురళి మోహన్.