ఆది సాయి కుమార్ 'తిస్ మర్ ఖాన్' మూవీ విడుదల తేదీ వచ్చేసింది..!
ఇది ఇలా ఉంటే ఆది సాయి కుమార్ ఈ మధ్య కాలంలో అనేక మూవీ లలో నటించినప్పటికీ ఈ హీరో నటించిన మూవీ లు చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బోల్తా పడ్డాయి. ఇది ఇలా ఉంటే ఆది సాయి కుమార్ ప్రస్తుతం క్రేజీ ఫెల్లో మరియు తీన్ మార్ ఖాన్ అనే రెండు మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కుతున్న తీస్ మర్ ఖాన్ మూవీ ని ఆగస్ట్ 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దక్కింది. ఈ మూవీ లో ఆది సాయి కుమార్ కు జంటగా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ మూవీ కి జి. గోగణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో సునీల్ , పూర్ణ కీలక పాత్రలలో కనిపించనుండగా , నాగం తిరుపతి రెడ్డి ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.
ఈ మూవీ ని దర్శకుడు జి. గోగణ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో ఆది సాయి కుమార్ స్టూడెంట్, రౌడీ, పోలీస్.. ఇలా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. సాయికార్తీక్ ఓ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ తో ఆది సాయికుమార్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.