పవన్ నిరాడంబరత చూసి షాక్ అయిన వీర మహిళలు !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తిస్థాడో ఎవరికీ అర్థంకాని విషయం. క్షణంలో ఆవేశంతో ఊగిపోయి కొద్ది సేపటికి మళ్ళీ శాంతమూర్తిల మారిపోతాడు. ఇలా అనుక్షణం రకరకాల మూడ్స్ లో పవన్ ఉంటాడు కాబట్టి అతనిని అర్థం చేసుకోవడం కష్టం. ఇలాంటి మనస్థత్వంతో ఉన్నవాళ్ళు రాజకీయాలకు ఎంత వరకు సరిపోతారు అన్న అభిప్రాయాలు కూడ ఉన్నాయి.  

అయితే పవన్ టాప్ హీరోగా కంటే ఒక ప్రముఖ రాజకీయ నాయకుడుగా ఎక్కువ కాలం ప్రజల మధ్య కొనసాగాలని భావిస్తున్నాడు. అందువల్లనే గత ఎన్నికలలో పవన్ కు ఘోర పరాజయం ఎదురైనప్పటికీ చలించకుండా తన ‘జనసేన’ ను మరింత చైతన్యవంతం చేస్తూ కనీసం వచ్చే ఎన్నికల నాటికైనా తన సత్తా చాటాలని త్వీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ప్రయత్నాలలో భాగంగా పవన్ లేటెస్ట్ గా ‘జనవాణి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.

ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ ప్రజల వద్దకు వెళ్ళి వారి కష్టాలను సమస్యలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈకార్యక్రమానికి స్పందన బాగానే వస్తున్నప్పటికీ ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల విషయమై సరైన పరిష్కారాలను ప్రజల ముందు పెట్టలేకపోతున్నాడు అన్న విమర్శలు కూడ వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే పవన్ లేటెస్ట్ గా తాడేపల్లి లోని తన జనసేన కార్యాలయంలో జనసేన మహిళా విభాగానికి చెందిన వీరమహిళలను కలిసాడు. ఈకార్యక్రమానికి విశేషమైన స్పందన వచ్చింది.

ఈ కార్యక్రమంలో అనేకమంది వీర మహిళలు పాల్గొన్నారు. ఈకార్యక్రమం ముగిసిన తరువాత చాలామంది వీర మహిళలు పవన్ కళ్యాణ్ తో ఫోటో తీయించుకోవాలని కోరినప్పుడు పవన్ ఒక సాదాసీదా వ్యక్తిలా అంతమంది మహిళల మధ్య నేల పై కూర్చుని తీయించుకున్నఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులైతే తెలుగు రాష్ట్రాలలోని ఏ రాజకీయ నాయకుడైనా ఇంత నిరాడంబరంగా నేల పై కూర్చుంటార అంటూ నేటి ప్రముఖ రాజకీయ నాయకులను ఉద్దేశించి ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: