టీజర్: టైటిలే నవ్విస్తుంటే.. ఇక సినిమా ఎలా ఉంటుందో..?

Divya
అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్.. తాజాగా నటిస్తున్న చిత్రం మా నీళ్ల ట్యాంక్... అని వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఓ టీ టీలో అడుగుపెడుతున్నారు. ఇందులో హీరోయిన్ ప్రియా ఆనంద్ కూడా నటిస్తోంది దాదాపుగా పదేళ్ల తర్వాత ఈమె ఈ సిరీస్తో తెలుగు లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ జీ-5 రూపొందిస్తున్న ఈ ఒరిజినల్ సిరీస్ త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కూడా మంచి రెస్పాన్స్ లభించింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ కూడా ఆవిష్కరించారు. అత్యంత వినోదభరితంగా సాగిన ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేల కనిపిస్తోంది. ఇందులో సుశాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. బుజ్జి బోర్డు అనే గ్రామంలో నీళ్ళ ట్యాంక్ చుట్టూ సాగే కథ అన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఊరు పెద్ద కోదండం కొడుకు గోపాల్ నీళ్ళ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడు.. అనే విధంగా టీజర్ మొదలవుతుంది. ఇక ప్రియా ఆనంద్ సుశాంత్ మధ్య కొన్ని సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్గా నిలిచే లా కనిపిస్తున్నాయి.

ఇందులో సుశాంత్ చాలా హ్యాండ్ సమ్ గా కనిపించనున్నారు. మొదటి సారి ఒక డిఫరెంట్ స్టైల్ లో కనిపించడానికి ట్రై చేస్తున్నారు. ఇక ఇందులో బిగ్ బాస్ దివి, నిరోష, అన్నపూర్ణమ్మ, లావణ్య రెడ్డి తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. మా నీళ్ళ ట్యాంక్ అనే వెబ్ సిరీస్ కు.. వరుడు కావలెను ఫేమ్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించింది. ఇక ఈ వెబ్ సిరీస్ కు రాజాశ్రీ సురేష్ కథ అందించారు. అరవింద్ విశ్వనాథ్ సినిమాటోగ్రఫీ గా పని చేశారు. ఈ వెబ్ సిరీస్ జులై 15 వ తేదీన జి5 స్ట్రీమింగ్ కానుంది. మరి టైటిల్ తోనే నవ్వించిన సుశాంత్ ఈ చిత్రంతో ఎలా నవ్విస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: