యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మహానటి మూవీ తో దర్శకుడిగా ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి అదిరిపోయే ప్రశంసలు అందుకొని బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే .
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతుంది . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది . కాగా తాజాగా హైదరాబాద్ లో ఈ మూవీ కి సంబంధించి ఓ షెడ్యూల్ షూటింగ్ ని చిత్ర బృందం పూర్తి చేసుకుంది . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా చిత్ర బృంద నికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా వైరల్ అవుతున్న ఈ ఫోటోలో నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీ ల్, అమితాబ్ బచ్చన్ , రాఘవేంద్రరావు , నాని , దుల్కర్ సల్మాన్ లతో పాటు ప్రభాస్ కూడా ఉన్నాడు . హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో వైజయంతీ మూవీస్ కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా వీరంతా ఈ ఫోటో ను తీసుకున్నారు . అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఇలా హేమా హేమీలు అయిన హీరోలు, దర్శకులు కలిసి దిగిన ఈ ఫోటో ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో లో ప్రభాస్ చాలా సన్న పడినట్లుగా కనిపిస్తోంది. ప్రభాస్ 'సలార్' సినిమా కోసమే కాస్త బరువు తగ్గి స్లిమ్ లుక్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' మూవీ తో పాటు ఆది పురుష్, సలార్ మూవీ లలో కూడా నటిస్తున్నాడు.