టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు ఆయన ఆది సాయికుమార్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆది సాయి కుమార్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మూవీలలో హీరోగా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏర్పరుచుకున్నాడు.
ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు సినిమాల్లో హీరోగా నటించిన ఆది సాయి కుమార్ మరి కొన్ని రోజుల్లో డిజిటల్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు. ఆది సాయి కుమార్ 'పులి మేక' అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన 'జీ 5' లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ వెబ్ సిరీస్ లో ఆది సాయి కుమార్ సరసన అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాటి హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈ వెబ్ సిరీస్ తాజాగా ప్రారంభం అయ్యింది. పులి మేక వెబ్ సిరీస్ లో ఆది సాయి కుమార్ , లావణ్య త్రిపాఠి తో పాటు సుమన్, సిరి హనుమంతు, ముక్కు అవినాష్ కూడా నటించబోతున్నారు. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పంతం మూవీ కి దర్శకత్వం వహించిన కె.చక్రవర్తి రెడ్డి ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించబోతున్నాడు.
ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కబోతుంది. పులి - మేక వెబ్ సిరీస్ పూజ కార్యక్రమాలు తాజాగా హైదరాబాద్ లో జరిగాయి. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ దర్శకులు అయిన అనిల్ రావిపూడి, బాబీ విచ్చేశారు. దర్శకుడు బాబీ క్లాప్ కొట్టగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేశారు. ఈ వెబ్ సిరీస్ లో ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి , సుమన్ కీలక పాత్రలలో నటిస్తూ ఉండడంతో ఈ వెబ్ సిరీస్ పై మంచి అంచనాలే ఉన్నాయి.