'మేజర్' చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపించిన చిరంజీవి..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన అడవి శేషు తాజాగా మేజర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.
 

ఈ సినిమాలో శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్ కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీలో ఒక ప్రధాన పాత్రలో ప్రకాష్ రాజ్ నటించాడు. ఈ మూవీ ని జి.ఎమ్‌.బి ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా కలిసి నిర్మించాయి. జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన మేజర్ సినిమా విడుదల అయిన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని, బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు ఇటు ప్రేక్షకుల నుండి, అటు విమర్శకుల నుండి కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అలాగే మేజర్ సినిమాపై ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. 

ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా 'మేజర్' చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి మేజర్ సినిమా గురించి స్పందిస్తూ... తాజాగా మేజర్ సినిమాను చూసిన చిరంజీవి 'మేజర్‌' ఒక సినిమా మాత్రమే కాదు, అదొక నిజమైన ఎమోషన్‌ అని, అమరవీరుడు మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని హత్తుకునేలా మూవీ ని తెరకెక్కించారని, తప్పకుండా చూడాల్సిన మూవీ అని ఇలాంటి మూవీ ని మహేశ్‌ బాబు నిర్మించినందుకు గర్వంగా ఉంది అని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. అలాగే మేజర్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. చిరంజీవి సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ  వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: