మహేష్ పై చిరంజీవి ప్రశంసలు వర్షం.. కారణం..!!

Divya
26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా వచ్చిన చిత్రం మేజర్. ఇందులో యువ హీరో అడవి శేషు నటించడం జరిగింది. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ, రేవతి, ప్రకాష్ రాజు వంటి వారు ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని శశికిరణ్ తిక్క డైరెక్టర్ దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది రికార్డు స్థాయిలో వసూళ్లను కూడా రావడమే కాకుండా పలువురు ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకుంటోంది.

సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలో జరిగిన సంఘటనను కళ్లకు కట్టినట్టుగా చూపించారు డైరెక్టర్. ఈ చిత్రం లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మైమరిపించారు నటించారు. తాజాగా చిరంజీవి మేజర్ చిత్రయూనిట్ ను అభినందించడం జరిగింది. మేజర్ చిత్ర బృందం తో కలిసి దిగిన కొన్ని ఫోటోలను తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు చిరంజీవి. మేజర్ ఒక చిత్రం మాత్రమే కాదు అదొక ఎమోషన్.. అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని హత్తుకునేలా తెరకెక్కించారు ఇది అందరూ తప్పకుండా చూడవలసిన చిత్రం అని తెలియజేశారు.

ఈ లాంటి చిత్రాన్ని మహేష్ నిర్మించడం ఎంతో గర్వంగా ఉంది ఈ సినిమాకి కంగ్రాచ్యులేషన్స్ అని తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట చాలా వైరల్ గా మారుతోంది. చిరంజీవి మంచి సినిమాలు ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారని ఇటీవల విక్రమ్ సినిమాని కూడా చూసి చిత్ర బృందాన్ని సత్కరించారు.అయితే కాగా మెగాస్టార్ చిరంజీవి ఈ ఫోటోలను చెవిపోగు లతో కనిపించడం విశేషం దీంతో ఇది ఏ సినిమా లుక్ అంటూ ఆరా తీసే పనిలో పడ్డారు అభిమానులు సైతం. అయితే చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: