అందుకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా : అప్పారావు

praveen
ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే కార్యక్రమం ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి ఒక మంచి ప్లాట్ ఫామ్ గా మారిపోయింది జబర్దస్త్. ఈ క్రమంలోనే ఇక ఈ షో ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న వారు ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నారు. అంతేకాకుండా ఎన్నో కష్టాలు పడిన వారు ఫైనాన్షియల్గా సెటిలయ్యారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వారు ఉన్నట్టుండి  గత కొంత కాలం నుంచి జబర్దస్త్ నుంచి బయటకు వస్తూ ఉండడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది.

 జబర్దస్త్ జడ్జ్ నాగబాబు నుంచి మొదలుపెడితే ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్లు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చారు. ఇక వేరే కామెడీ షోస్ చేసుకుంటున్నారు. ఇటీవల ఈ లిస్టులో జబర్దస్త్ అప్పారావు కూడా చేరిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు తన తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని అలరించిన అప్పారావు జబర్దస్త్ నుండి బయటకు వచ్చి స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ లో నటిస్తున్నారు. అయితే జబర్దస్త్ నిర్వాహకుల  తీరుతో అసంతృప్తి చెంది అందరు బయటకు వస్తున్నట్లు ఒక టాక్ కూడా వినిపిస్తోంది.

 ఈ క్రమంలోనే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ అప్పారావు షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. తనకు జబర్దస్త్లో అవకాశం రావడానికి శకలక శంకర్ కారణం అని..  చంటి వల్ల ఎంతో గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కరోనా వల్ల కొన్నాళ్లపాటు జబర్దస్త్ నుండి దూరం పెట్టిన తర్వాత బుల్లెట్ భాస్కర్ టీం లో చేయాలని అన్నారు.  కానీ తాను మాత్రం ఒప్పుకోలేదని. ఆ తర్వాత రాకింగ్ రాకేష్ టీం లో చేయమని చెప్పినా.. పారితోషకం  విషయంలో మాత్రం అసంతృప్తి చెందానని.. దీంతో బయటకు రావాలని డిసైడ్ అయ్యాను అని.. ఇక ఎన్వోసీ అడిగితే ఎందుకు వెళ్లిపోతున్నారని కూడా మేనేజ్మెంట్ కనుక్కోలేదు అంటు తనకు ఎదురైనా చేదు అనుభవాలను చెప్పుకొచ్చారు అప్పారావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: