సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా విడుదలైన సర్కారు వారి పాట మూవీ తో మరో విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. అలాగే అదిరిపోయే కలెక్షన్లను కూడా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రాబడుతుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా జరిగిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు తమన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కాయి. ఈ రెండు సినిమాలలో అతడు సినిమా మంచి విజయం సాధించగా, ఖలేజా సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన బుల్లితెరపై మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అసలు విషయం లోకి వెళితే... సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ మే 31 వ తేదీన రానున్నట్లు ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. మరి మే 31 వ తేదీన చిత్ర బృందం ఇలాంటి అప్డేట్ ను విడుదల చేయబోతోందో చూడాలి. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే తాజా సినిమా కెరియర్ పరంగా మహేష్ బాబు కు 28 వ సినిమా. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లేదా జులై నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.