F-3 సినిమా టికెట్ల ధరల పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..!!

Divya
F-3 లో హీరోలుగా వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్నారు. ఇక కథానాయకిలుగా తమన్నా మెహరీన్, సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు. ఇందులో ఒక స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ పూజా హెగ్డే కూడా నటిస్తున్నది. గతంలో తీసిన f-2 చిత్రం 100 కోట్లకు పైగా కలెక్షన్లు చేసింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ ను డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా పూర్తి చేశారు. ఈ సినిమా ఈ నెల 27వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో సునీల్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు చిత్ర బృందం.
ఇక ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు తాజాగా ఈ సినిమా గురించి ఒక మంచి విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం విడుదలైన స్టార్ హీరోల సినిమాలు అన్నిటికీ విపరీతమైన రేట్లు పెంచడంతో ఈ విషయంపై ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ముందుగా టికెట్ రేటు పెంచితే ఎక్కువ కలెక్షన్లు వస్తాయి ఏమో కానీ.. ఆడియన్స్ తగ్గిపోయి నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది అన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై ఏన్నో రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

F-3 సినిమా ఈ విషయంలో కూడా టికెట్ల మీద పలు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే టికెట్ రేట్లు పెంచితే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా దూరంగా ఉంటారని.. ఆలోచించండి నిర్మాత దిల్ రాజు.. సినిమా ఆడియో ఫంక్షన్ లో మాట్లాడిన దిల్రాజు టికెట్ రేట్లను పెంచడం లేదని విషయాన్ని తెలియజేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఈ సినిమా టికెట్ల ధరలను ఆమ్ముతున్నానని తెలియజేశారు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు ఇతర ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.. ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది ఒక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

f3

సంబంధిత వార్తలు: