నటనకు ప్రాధాన్యత ఉంటే ఏ పాత్రలోనైనా నటించడానికి రెడీ... నివేదా పేతురాజ్..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొంత మంది ముద్దుగుమ్మలు మాత్రం తన అందంతో, నటనతో ఆకట్టుకొని తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ ఎక్కువ ప్రాధాన్యతను సంపాదించుకుంటారు. అలా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నటించినది తక్కువ సినిమాలే అయినా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో నివేదా పేతురాజ్ ఒకరు.  నివేదా పేతురాజ్ , శ్రీ విష్ణు హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకుంది.  

మెంటల్ మదిలో సినిమా తో మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకున్న నివేదా పేతురాజ్ ఆ తర్వాత మరోసారి శ్రీ విష్ణు ,  వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రోచేవారెవరురా మూవీ లో నటించి ప్రేక్షకులను అలరించింది.  అలాగే అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అలా వైకుంఠపురంలో మూవీ లో నటించిన నివేదా పేతురాజ్ ఈ సినిమా తో మంచి గుర్తింపు ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది.  అలాగే ఈ మధ్య కాలంలో నివేదా పేతురాజ్ 'పగల్'  సినిమాతో ప్రేక్షకులను అలరించింది. అలాగే ప్రముఖ 'ఓ టి టి' ఆహా  విడుదల అయిన  బ్లడ్ మేరీ సినిమా తో కూడా నివేతా పేతురాజ్ తాజాగా ప్రేక్షకులను అలరించింది

ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా పేతురాజ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.  హీరోయిన్ గా మూవీ లు లేకపోతే కెరియర్ ఉండదేమో అని  చాలా మంది భయపడుతుంటారు, కానీ నాకు మాత్రం అలాంటి భయం ఏమాత్రం లేదు.  నేను ఎలాంటి బౌండరీస్ ను కూడా పెట్టుకోలేదు.  నటనకు ప్రాధాన్యత ఉండే ఎలాంటి పాత్రలు చేయడానికి ఆయన నేను రెడీ అని తాజా ఇంటర్వ్యూలో నివేదా పేతురాజ్ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: