టీజర్:ఆర్జివి విడుదల చేసిన హర్రర్ నాఘం ..!!

Divya
ఏ భాషలో నైనా సరే హర్రర్, థ్రిల్లర్ నిమాలను ఇష్టపడే టువంటి ప్రేక్షకులు ఉండనే ఉంటారు. అలాంటి వారికోసమే ఇప్పుడు తాజాగా నాఘం అనే సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని నరసింహ జీడి డైరెక్షన్లో తెరకెక్కించడం జరుగుతోంది ఇటీవల మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.. అయితే నిన్నటి రోజున డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ ను కూడా విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ తెలియజేయడం జరిగింది.

ఈ యూనిక్ మ్యూజికల్ థ్రిల్లర్ నాఘం టీజర్ ను చూడండి అని రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ నుంచి తెలియజేసినాడు. అంతే కాకుండా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈ వీడియోని తన అభిమానులతో పంచుకోవడం జరిగింది. ఎక్కువగా హర్రర్ సినిమాలను ఇష్టపడే వారు నాఘం సినిమా టీజర్ ఆకర్షిస్తుందని తెలియజేశారు. కథ ఏంటి అనే విషయాన్ని రిలీజ్ చేయకుండా సినిమాపై ఆసక్తి పెంచేలా ఈ టీజర్ని కట్ చేయడం జరిగింది. అన్ని హర్రర్ చిత్రాల మాదిరిగానే ఒక అండ్ వైట్ హౌస్ లో కదా అంత సెట్ చేసినట్లుగా కనిపిస్తోంది.

కొందరు వ్యక్తులు ఆ ఇంట్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి వారిని ఒక ఆత్మ వెంటాడుతుంది అన్నట్లుగా ఈ టీజర్ చూపించడం జరుగుతుంది. ఈ సినిమా కథ ఏంటో తెలియాలి అంటే నాఘం సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.. కేవలం ఎలాంటి డైలాగ్స్ లేకుండా ఆకర్షణీయమైన బ్యాక్గ్రౌండ్ తోనే ఈ చిత్రం టిజర్ ను విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకొనేలా కనిపిస్తోంది. ఈ చిత్రంలోని సన్నివేశాలు హర్రర్ సినిమాలకూ తగ్గట్టుగానే కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో గణేష్ రెడ్డి, వేమి మమత రెడ్డి, రాజేంద్ర కుమార్, శివా దోసకాయల, మనీ గోగి సెట్టీ తదితరులు నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: