ప్రేక్షకుల్లో ఉత్కంఠ.. చివరకు ఏమవుతుందో.. !
మహేశ్ బాబు సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్స్తో మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తుంటాడు. అయితే ఇప్పుడు తొలిసారి పరశురామ్తో ఒక సినిమా చేస్తున్నాడు. బ్యాంక్ స్కామ్స్ బ్యాక్డ్రాప్లో 'సర్కారు వారి పాట' పాడుతున్నాడు. ఇప్పటికే వచ్చిన ఈ మూవీ టీజర్, సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా మే 12న విడుదలవుతోంది.
ప్రభాస్ పాన్ ఇండియన్ హీరోగా మారాక డైరెక్టర్స్ని ఎక్కువగా రిపీట్ చేయడం లేదు. కొత్త కాంబినేషన్స్తోనే సినిమాలు చేస్తున్నాడు. రిజల్ట్తో సంబంధం లేకుండా యంగ్ డైరెక్టర్స్కే కాల్షీట్స్ ఇస్తున్నాడు. ప్రశాంత్ నీల్తో 'సలార్', ఓం రౌత్తో 'ఆదిపురుష్' సినిమాలు చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె' అనే సైన్స్ ఫిక్షన్ డ్రామా మొదలుపెట్టాడు. వీటితోపాటు సందీప్ వంగాతో 'స్పిరిట్'కి కమిట్ అయ్యాడు.
జూనియర్ ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ ఫామ్లో ఉంటే ఆ డైరెక్టర్ని ప్రిఫర్ చేస్తాడనే టాక్ ఉంది. కొన్నిసార్లు ఇలాంటి సక్సెస్ లెక్కలతో బోల్తా కూడా పడ్డాడు. అయితే పాన్ ఇండియన్ స్టార్గా ఎదగాలనుకుంటోన్న తారక్, మళ్లీ హిట్ ఫార్ములానే ప్రయోగిస్తున్నాడు. 'కెజిఎఫ్'తో పాన్ ఇండియన్ డైరెక్టర్గా ఎదిగిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమాకి సైన్ చేశాడు తారక్.
రామ్ చరణ్ కెరీర్ బిగినింగ్లోనే 'జంజీర్'తో బాలీవుడ్కి వెళ్లాడు. కానీ ఈ మూవీ ప్లాప్ అయ్యి చరణ్ మార్కెట్ విస్తరణ పనులకి బ్రేకులేసింది. అయితే 'ఆర్ ఆర్ ఆర్'తో చరణ్కి నార్త్లో మంచి క్రేజ్ వచ్చింది. ఈ బజ్ని స్టార్డమ్గా మార్చుకోవడానికి భారీ సినిమాల దర్శకుడు శంకర్తో పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నాడు చరణ్.
అల్లు అర్జున్ 'పుష్ప'తో కెరీర్ బెస్ట్ కొట్టాడు. హిందీలో ఈ సినిమా 100 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. నార్త్లో బీ,సీ సెంటర్స్లో బన్ని బిగ్గెస్ట్ స్టార్గా అవతరించాడు. ఇక సక్సెస్ జోష్లో ఉన్న అల్లు అర్జున్ నెక్ట్స్ కొరటాల శివతో ఒక సినిమా చేయబోతున్నాడు. అలాగే వేణు శ్రీరామ్తో 'ఐకాన్', ప్రశాంత్ నీల్తో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు అల్లు అర్జున్.