టాలీవుడ్ మూవీల్లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన ఐదు లిరికల్ సాంగ్స్ ఇవే..!

Pulgam Srinivas
స్టార్ హీరోలు నటించిన సినిమాల లోని పాటలకు,  స్టార్ దర్శకులు దర్శకత్వం వహించిన సినిమాలోని పాటలకి , అలాగే స్టార్ మ్యూజిక్ దర్శకులు సంగీతం సమకూర్చిన పాటలకు  ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం.  అయితే కొన్ని సాంగ్స్ మాత్రం విడుదలైన అతి తక్కువ సమయం లోనే ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకొని,  అదిరిపోయే వ్యూస్ ను కూడా సాధిస్తూ ఉంటాయి. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోని సినిమాల్లో నుంచి విడుదల అయ్యి,  24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన 5 సాంగ్స్ గురించి తెలుసుకుందాం.


పెన్నీ సాంగ్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాలోని పెన్నీ సాంగ్ విడుదల అయిన 24 గంటల్లో 16.38 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సాంగ్ ఇప్పటికి కూడా యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

 
కళావతి : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాలోని తమన్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన కళావతి సాంగ్ విడుదలైన 24 గంటల్లో 14.78 మిలియన్ వ్యూస్ ని సాధించింది. ఈ మూవీ లో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.


మా మా మహేష : సర్కారు వారి పాట సినిమాలోని 'మా మా మహేష'  అనే సాంగ్ విడుదలైన 24 గంటల్లో 13.56 మిలియన్ వ్యూస్ ని సాధించింది. ఈ మూవీ కి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.


ఊ అంటావా... ఊ ఊ అంటావా : అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మూవీ లోని ఊ అంటావా... ఊ ఊ అంటావా సాంగ్  విడుదలైన 24 గంటల్లో 12.39 మిలియన్ వ్యూస్ ని సాధించింది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా , ఈ స్పెషల్ సాంగ్ లో సమంత నటించింది.


ల ల భీమ్లా : తమన్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమాలోని 'ల ల భీమ్లా'  సాంగ్ విడుదల అయిన 24 గంటల్లో 10.20 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా నటించగా , ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: