జనాలు అబద్ధాలనే ఎక్కువగా నమ్ముతారు...సమంత..!

Pulgam Srinivas
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు ఆయన సమంత గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  సమంత  'ఏ మాయ చేసావే'  మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.  మొదటి సినిమా తోనే ఎంతో మంది  ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్న సమంత ఆ తర్వాత వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది.  అందులో భాగంగా సమంత నటించిన సినిమాలలో ఎక్కువ శాతం మూవీ లు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో అతి తక్కువ కాలంలోనే సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది.  

అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా  కంటిన్యూ అవుతున్న సమయంలోనే సమంత నాగ చైతన్య ను వివాహం చేసుకుంది.  కొంతకాలం క్రితమే వీరిద్దరికి విడాకులు అయ్యాయి.  విడాకుల తర్వాత సమంత తన సినిమాల జోరు ను పెంచింది. సమంత ప్రస్తుతం శాకుంతలం మరియు యశోద సినిమాల  షూటింగ్ ను పూర్తి చేసుకుంది.  ఈ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.  ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్న సమంత సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.  సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ఎప్పటికప్పుడు ముచ్చటించడం,  తాను వెళ్లిన వెకేషన్ కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేయడం,  అలాగే అప్పుడప్పుడు తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉండడం,  ఇలా సోషల్ మీడియా ద్వారా సమంత ఎప్పుడు అభిమానులతో టచ్ లోనే ఉంటుంది.  

అలాగే సమంత అప్పుడప్పుడు కొన్ని కొటేషన్స్ ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.  తాజాగా కూడా ఒక కొటేషన్ ను సమంత తన సోషల్ మీడియా అకౌంట్ లో  పోస్ట్ చేసింది ' నిజాలు  చాలా అరుదుగా బయటకు వస్తాయి. కాకపోతే సమాజం అబద్దాలనే ఎక్కువ‌గా న‌మ్ముతుంది. అలాంటి అబ‌ద్దాలే ఎక్కువ‌గా ప్రచారంలో కూడా ఉంటాయి’’ అని సమంత తాజాగా  రాసుకొచ్చింది. తాజాగా సమంత రాసుకొచ్చిన ఈ కొటేషన్ నెట్టింట వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: