రోజా భర్త కు షాకిచ్చిన స్టార్ హీరో..!!

Divya
ఆంధ్రప్రదేశ్ మంత్రి నటి రోజా భర్త ఆర్ కే సెల్వమణి కి తమిళ స్టార్ హీరో అయినటువంటి విజయ్ బిగ్ షాక్ ఇచ్చారన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన మాటని లెక్కచేయకుండా ఒక పని చేశారని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయంపై తమిళ వర్గం మీడియాలో కూడా అవుననే చెబుతున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే స్టార్ హీరో విజయ్ ఇటీవల విడుదలైన బీస్ట్ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ చిత్రాన్ని తమిళంలో తెలుగులో కూడా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్గా పూజాహెగ్డే నటించింది.
ఈ సినిమా అనంతరం తీవ్ర వివాదానికి తెరలేపింది ఈ చిత్రం. అయితే ఆశించిన స్థాయిలో ఈచిత్రం ఆకట్టుకోలేక పోయిందని విజయ్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక చెన్నైలో ఏకంగా ఒక థియేటర్ కు నిప్పు పెట్టి సంచలనం సృష్టించారు. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అవడంతో హీరో విజయ్ తో పాటుగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ పై కూడా విమర్శలు చేయడం జరిగింది. ఇక విజయ్ తండ్రి ఏకంగా డైరెక్టర్ ని టార్గెట్ చేస్తూ కొన్ని సంచలన విషయాలను కూడా చేశారు. దీంతో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. కేవల విజయ్ స్టార్ డమ్ వల్లే అంత మాత్రం కలెక్షన్లు వచ్చాయి కంటెంట్ బాగుంది కానీ ఈ సినిమా స్క్రీన్ ప్లే లేదని తెలియజేశాడు.
ఇక అసలు విషయంలోకి వెళితే ఆర్.కె.సెల్వమణి ప్రస్తుతం ఫిలిమ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది స్టార్ హీరోలను తమ సినిమా షూటింగులు చెన్నైలోనే చేయకుండా హైదరాబాదులో చేస్తున్నారని దాంతో ఇక్కడ ఉన్న కార్మికుల పరిస్థితి చాలా తీవ్రంగా నష్టపోతున్నారని.. సార్ హీరోల షూటింగ్ కేవలం చెన్నైలోనే జరపాలని తెలియజేశారు. కానీ నిన్నటి రోజున విజయ నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం హైదరాబాదులోని చేశారు. ఈ సినిమాకి దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ రష్మిక నటిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: