కొరటాలకు దెబ్బేసిన మెగా ఫ్యామిలీ.. కోలుకుంటాడా?
సాధారణ ప్రేక్షకులే కాదు మెగా అభిమానులు సైతం సినిమా అస్సలు బాగోలేదు అంటూ నిట్టూర్పు విడుస్తున్నారు. అసలు చాలా మంది వ్యక్తం చేస్తున్న అనుమానం ఏమిటంటే అసలు ఈ సినిమా తీసింది సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాలేనా కాదా అని. ఇంకొందరు ఏమంటున్నారు అంటే ఈ సినిమా కథ అసలు కొరటాల అనుకున్నది కాదు నిజానికి దర్శకుడు అనుకున్న లైన్ వేరే స్క్రీన్ పై కనిపించింది వేరే అని. అసలు ఈ సినిమా పూర్తిగా చిరు పైనే ఫోకస్ చేసి కథను సిద్ధం చేశారట కొరటాల. అయితే ఒక 10 నిముషాల గెస్ట్ రోల్ ని మాత్రం చెర్రీ కోసం రాశారట అయితే తన భర్త అలాగే తనయుడు ఈ చిత్రంకి ఎక్కువ నిడివి కలిగిన పాత్రల్లో కనిపించాలి అన్నది కొణిదెల సురేఖ గారు ఆకాంక్ష అట.
దాంతో మెగా హీరోలు జోక్యం చేసుకుని మరీ చరణ్ పాత్రను పెంచమనడంతో కొరటాల 10 నిముషాల పాత్రను 45 నిముషాల పాత్రకు పొడిగించడం దాంతో చిరు కి జోడీగా అప్పటికే సెలెక్ట్ చేసిన కాజల్ పాత్రను తొలగించడం, కథలో అందుకు తగ్గట్లుగా కొన్ని మార్పులు చేయడంతో అసలు కథ కాస్త అటకెక్కి అతుకులు కథగా మారిందని అంటున్నారు. అలా కొరటాల పాపం మెగా హీరోల జోక్యంతో ఇరుకున పడి ఓటమిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారని ప్రచారం సాగుతోంది. లేకపోతే జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మిర్చి వంటి కొరటాల చిత్రాలు ఎక్కడ ఆచార్య సినిమా ఎక్కడ అంటున్నారు. అదీకాక ప్రభాస్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్ లు అసలు డైరెక్షన్ జోలికి పోరు డైరెక్ట్ ఏమి చెబితే అదే చేస్తారు ఆ ఫ్రీడమ్ ఆచార్య చిత్రంలో కొరటాలకు లేకపోవడం తోనే తొలిసారి ఓటమిపాలయ్యారు అన్నది ప్రెజెంట్ టాక్. మరి ఈ ఓటమై నుంచి తేరుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.