ఆ కారణం చేతనే రామ్ చరణ్... బోయపాటి మధ్య దూరం పెరిగిందా..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,  బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వినయ విధేయ రామ సినిమా తెరకెక్కిన విషయం మన అందరికి తెలిసిందే.  ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా,  ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో వివేక్ ఒబ్రాయి నటించాడు.  ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా,  వినయ విధేయ రామ సినిమాను  భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు.  

రంగస్థలం లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  నటించిన సినిమా కావడంతో వినయ విధేయ రామ సినిమాపై  ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.  అలాగే  సినిమా విడుదలకు ముందు వినయ విధేయ రామ సినిమా నుండి విడుదల చేసిన పాటలకు, టీజర్, ట్రైలర్  ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఉండడంతో  ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నాడు.  ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్ లలో విడుదల అయ్యింది.  

కాకపోతే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ టాక్ ను తెచ్చుకొని,  చివరగా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది.  ఈ సినిమా విషయంలో బోయపాటి శ్రీను కూడా అనేక ట్రోల్స్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది.  అలాగే కొన్ని సన్నివేశాలను బోయపాటి శ్రీను తెరకెక్కించిన విధానంపై కూడా అనేక విమర్శలను  ఎదుర్కొన్నారు.  అయితే వినయ విధేయ రామ సినిమా వల్ల రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల మధ్య దూరం పెరిగింది అని తెలుస్తోంది.  వినయ విధేయ రామ మూవీ విడుదలైన తర్వాత రామ్ చరణ్ ఈ సినిమా రిజల్ట్ గురించి స్పందిస్తూ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఇలా రామ్ చరణ్ బహిరంగ లేఖ విడుదల చేయడంతో బోయపాటి శ్రీను హర్ట్ అయినట్లు తెలుస్తుంది. ఆ కారణం  వల్లే బోయపాటి శ్రీను ,  మెగాపవర్ కాంపౌండ్ కు దూరంగా ఉన్నాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: